కరువొచ్చింది. పంటలు ఎండిపోయాయి.
వరదొచ్చింది. పంటలు కొట్టుకుపోయాయి.
పప్పుల ధరలు పెరిగిపోయాయి.
బియ్యం కనుమరుగై పోతుందిట.
రోగాలు విజృంభిస్తున్నాయి.
ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.
వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి ?
ప్రభుత్వం బుర్ర బ్రద్దలగొట్టుకుని పరిష్కారం ఆలోచించింది.
అదే ' మందు తాగండోయ్ ! బాబులూ !! ' నినాదం.
అంతే ! ప్రభుత్వాదికారులందరు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు.
ఆ రకంగా ప్రభుత్వోద్యోగులందరికీ పని దొరికింది.
అడుగడుగునా కొత్త కొత్త మందు దుకాణాలు వెలిసాయి.
ఆ రకంగా నిరుద్యోగ సమస్య కొంత వరకు తగ్గింది.
సంపాదనంతా సారాకు పోతుంటే కుటుంబమంతా ఆకలితో చచ్చిపోతోంది.
మందు కొట్టిన వాహనాలు రోడ్డు మీద కాకుండా జనాల మీదుగా వెడుతున్నాయి.
ఆ రకంగా జనాభా సమస్య పరిష్కారం అవుతోంది.
అన్ని బాధలు మర్చిపోయి ప్రజలు హాయిగా మత్తులో మునిగిపోతున్నారు.
ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తగ్గిపోయింది.
అబ్బో ! ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి !
ఇంతకన్నా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వముందా !!
Thursday, November 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
ఆమె నటనలో జీవించింది కానీ జీవితంలో నటించలేదు ఆమె నటన ఎందరికో మార్గదర్శకం కానీ ఆ జీవితం కాదు ఎవ్వరికీ ఆదర్శం తెలుగు చిత్రసీమ గర్వంగ...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొద...
No comments:
Post a Comment