
"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను"
" దోచుకు తినడమే సమాజపు అసలు తత్త్వం. దానిని మిగతా వారికి చెప్పాలని రాయడం ప్రారంభించాను "
రావిశాస్త్రిగా పిలువబడే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అంతరంగం ఇది. ఆయన రచనల్లో ఆవిష్కరించిన అంతరంగం కూడా ఇదే ! పీడిత ప్రజలకోసం రాసిన రచయితలు చాలామందే ఉన్నారు. వారెవరికీ లేని విలక్షణ శైలి ఆయన ప్రత్యేకత. ఆయన వాళ్ల జీవితాల్లోకి చొచ్చుకెళ్లారు. వాళ్ల జీవితాల్ని ఆక్రమించేసారు. వాళ్ళతో మమేకం అయిపోయారు. వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ పంచుకున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ఎండగట్టారు. సమాజంలో సగటు మనిషి ఎలా దోపిడీకి గురవుతున్నాడో కళ్ళెదుట చూపించారు. మనిషికి ఉండే కలలు, కోరికలు...అవి తీరే మార్గం లేక, తీర్చుకునే శక్తి లేక అతడు పడే మానసిక ఘర్షణను చిత్రీకరించారు. తద్వారా సమాజపు అసలు రూపాన్ని బైట పెట్టారు. అందరూ భావించినట్లు ఆయన మార్క్సిస్టా ! ఏమో ! మరి ఆయన ఏ సిద్ధాంతాలు ప్రవచించలేదు. నినాదాలు చెయ్యలేదు. కానీ ఆయన హ్యుమనిష్టు. ఆయన చేసినది సగటు మనిషి తరుఫున వకాల్తా తీసుకుని వాదించడమే ! ఎంతైనా ప్లీడరు కదా !! ఆ అనుభంవల్ల కాబోలు సాక్ష్యానికే తప్ప నిజానికి విలువ ఇవ్వని న్యాయ వ్యవస్థ అమాయకులైన ప్రజల్ని ఎలా బలి తీసుకుంటోందో వివరించారు. ప్రజలకు రక్షణగా ఉండడానికి ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ సామాన్య ప్రజల పాలిట శాపంగా ఎలా మారిందో చూపించారు.
ఆయనది విలక్షమైన శైలి. విభిన్నమైన శిల్పం. సగటు జీవి వాస్తవిక జీవితాన్నే కాదు అతని

*******రావిశాస్త్రి గారి వర్థంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ...........********
No comments:
Post a Comment