Tuesday, June 25, 2013
తెలివి తక్కువ తనంలో హాస్యం
Thursday, February 9, 2012
నాటకాల చెళుకులు
మేనేజర్ : తప్పకుండా బాబూ ! అదీ తెప్పించాను. అయిదో అంకం ఒకటో సీనులో నువ్వు పుచ్చుగోవలసిన విషం కూడా సిద్ధం ఇందాకే చేయించి వుంచాను.
****************************************************************************************************
Friday, February 3, 2012
నో గో కలర్
" ఏం ? నేనేమైనా తప్పు మాట్లాడానా ? " అని అడిగారట.
దానికి రాజాజీ " లేదు లేదు. ఇది కస్తూర్బా ఇంగ్లీష్ " అని మరో చమత్కారం విసిరారట.
Sunday, January 22, 2012
కంద పద్య పాదాలు
Saturday, December 10, 2011
జడ్జికి శిక్ష
ఒకప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకుడిగా పనిచేసిన ఎ. యస్. రామన్ విద్యార్థిగా వుండగా ఒక ప్రపంచ న్యాయస్థానం కార్యక్రమం జరిపారు. అందులో కేసు ' సైన్స్ మానవాళికి హాని చేస్తోంది ' అనే విషయం గురించి. సైన్స్ తరఫున సూరి భగవంతం గారు, ప్రజల తరఫున మామిడిపూడి రంగయ్య గారు వాద ప్రతివాదులు.
మూడు గంటలకు సరిపడా కార్యక్రమం రూపొందించారు. ఆ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉండమని సి. ఆర్. రెడ్డి గారిని కోరారు. మూడు గంటలే కదా అని రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇరువైపులా వున్నది సామాన్యులా ? ఒకరు తర్వాత కాలంలో భారత దేశం గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడిగా ఎదిగిన వారు. మరొకరు తర్వాత రోజుల్లో రచయిత, విమర్శకుడు గా ఖ్యాతి వహించిన వారు. వాద ప్రతివాదాలు నిరాఘాటంగా తొమ్మిది గంటలు సాగాయి.
చివరికి రెడ్డి గారు న్యాయమూర్తిగా తన తీర్పుని సైన్స్ కి అనుకూలంగా ఇచ్చారు. అయితే శిక్ష విషయానికొచ్చేటప్పటికి ఆయన సహజ ధోరణిలో
" నిజానికి ఈరోజు దోషిగా బోనులో నుంచున్నది సైన్స్ కాదు.... నేను. ఇంత సమయం అవుతుందని తెలియక ఈ న్యాయమూర్తి పదవికి ఒప్పుకున్నాను. అందుకే నాకు బాగా శిక్ష పడింది "
అనడంతో అందరూ ఘొల్లుమన్నారు.
Vol. No. 03 Pub. No. 086
Thursday, December 8, 2011
కృష్ణపక్షం
మనసు కవి ఆత్రేయ చమత్కార భాషణం గురించి చాలా చెప్పుకోవచ్చు. భవిష్యద్దర్శనం చెయ్యగల మేధావి కూడా ఆయన. నిజాలను నిర్భయంగా చెప్పుకునే గొప్ప వ్యక్తిత్వం ఆయనది.
ఒకసారి ఒక నిర్మాత ఆత్రేయ గారి రచన, దర్శకత్వంలో ' అన్నమాచార్య ' చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. దానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి.
ఆ సందర్భంలో జరిగిన ఓ ఇష్టాగోష్టిలో ఒక మిత్రుడు ఆయన్ని
" ఆత్రేయ గారూ ! కలం పేరుగా మీరు ఈ పేరే పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది ? " అని అడిగారు.
దానికి ఆత్రేయ గారు నిట్టూరుస్తూ
" అప్పుడు ఆలోచించలేదు. ఆత్రేయ అంటే చంద్రుడు కదా ! చంద్రుడికి వృద్ధి, క్షీణతలు వుంటాయని గ్రహించి వుండవల్సింది. ప్రస్తుతం నా జీవితంలో ' కృష్ణపక్షం ' నడుస్తోంది " అన్నారు.
అలాగే ఆ ' అన్నమాచార్య ' చిత్ర నిర్మాణం ఆగిపోయింది.
Vol. No. 03 Pub. No. 084
Saturday, November 12, 2011
తాజ్ మహల్ కట్టించమంటే.....
ఒక విలేఖరి ఆరుద్ర గారితో " మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారో గానీ ఈ గడ్డంతో మీరు మొగల్ పాదుషా షాజహాన్ లాగ కనిపిస్తున్నారు " అన్నాడు.
వెంటనే ఆరుద్ర గారు ఆ గెడ్డం సవరించుకుంటూ " ఈ మాట నాతో అంటే అన్నారు గానీ మా ఆవిడ దగ్గర మాత్రం అనకండి. ఇప్పుడు ఆవిడ తానో ముంతాజ్ ననుకుని ఏ తాజ్ మహలో కట్టించమంటే గెడ్డం పెంచినంత సులువు కాదు కదా ! " అన్నారట.
Wednesday, October 12, 2011
ఎవరు గొప్ప ?
Vol. No. 03 Pub. No. 056
Friday, October 7, 2011
అధికారికి ప్రేమలేఖ
" ప్రాణేశ్వరీ ! అనుకోకుండా ఊరికి వెడుతున్నాను. కనుక ఈ మూడురోజులూ మనకి వియోగం, విరహవేదన తప్పవు...... " అంటూ ఇంకా ఏదేదో రాసి వుంది. అది ప్రేమ లేఖ అని పట్టాభి గారికి అర్థమయింది గానీ ఎవరు రాసారో, తనకెందుకు వచ్చిందో మాత్రం అర్థం కాలేదు. సాధారణంగా ప్రేమలేఖల్లో వుండేటట్లే సంభోదనలో గానీ, సంతకంలో గానీ కొసరు పేర్లే గానీ అసలు పేర్లు లేవు. అందుకనే ఆయనకేమీ అర్థం కాలేదు.
ఎటూ పాలుపోక తన మిత్రుడు కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు గారికి ఆ ఉత్తరం చూపించారు పట్టాభిగారు. అది చదివిన కృష్ణారావు ఆ చేతివ్రాత నిశితంగా పరిశీలించి ఆ రాత ప్రముఖ సాహితీకారుడు, చిత్రకారుడు అయిన అడవి బాపిరాజు గారిదని గుర్తుపట్టారు. కానీ బాపిరాజు గారు రాసిన ప్రేమలేఖ పట్టాభి గారికెలా వచ్చిందో అర్థం కాలేదు. ఆ విషయమే ఆయన్ని అడిగారు కృష్ణారావు గారు. అప్పుడు ఆలోచిస్తే ఇద్దరికీ విషయం బోధపడింది. ఏమిటంటే............
అప్పట్లో అడవి బాపిరాజు గారు జాతీయ కళాశాలకు ప్రధానాచార్యులుగా వుండేవారు. ఆయన ఆ సమయంలో స్వంత పని మీద ఊరికి వెళ్ళారు. బహుశః ఆ విషయం తెలియజేయ్యడానికి సమయం లేక ఆయన భార్యకు ఈ లేఖ రాసి ఉంటారని... పట్టాభి గారికి సెలవు మంజూరు కోరుతూ సెలవు చీటీ రాసి ఉంటారని... అయితే కవరు మీద చిరునామాలు తారుమారు అయి ఉంటాయని నిర్థారణకు వచ్చి నవ్వుకున్నారు పట్టాభి గారు, కృష్ణారావు గారు.
Thursday, September 29, 2011
కవిసమయం
Vol. No. 03 Pub. No. 044
Sunday, September 18, 2011
కీర్తి తెచ్చిన తంటా
ఒకసారి మామ్ భార్యా సమేతంగా స్పెయిన్ దేశం వెళ్లారు. అక్కడ ఆయనకు తన పుస్తకాలమీద ప్రచురణ కర్తల నుంచి పెద్ద మొత్తంలో రాయల్టీ లభించింది. ఇంతవరకూ బాగానే వుంది గానీ అంత పెద్ద మొత్తాన్ని అక్కడినుంచి తీసుకెళ్ళడానికి స్పెయిన్ దేశ చట్టాలు ఒప్పుకోవు. అందుకని ఏం చెయ్యాలో మామ్ కి అర్థం కాలేదు. బాగా అలోచించి ఆ డబ్బును అక్కడే సరదాగా కాలక్షేపం చేసి ఖర్చు చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు.
మాడ్రిడ్ లోని అత్యంత ఖరీదైన హోటల్లో బస చేసి భార్యతో కలసి రాజభోగాలు అనుభవించారు మామ్. చాలావరకు ఖర్చు అయ్యాక ఇక తన దేశానికి బయిలుదేరాడు. హోటల్ ఖాళీ చేసే క్రమంలో యాజమాన్యాన్ని బిల్ ఇమ్మని అడిగాడు. దానికి ఆ యాజమాన్యం చెప్పిన సమాధానం సోమర్సెట్ మామ్ ని విస్తుపోయేటట్లు చేసింది.
" అయ్యా ! మీలాంటి గొప్ప రచయిత మా హోటల్లో బస చెయ్యడమే మా అదృష్టం. మీరు ఇక్కడ బస చెయ్యడం వల్ల మా హోటల్ ప్రతిష్ట కూడా పెరిగి మా వ్యాపారం రెట్టింపు అయింది. దానికి మేమే మీకు ఋణపడి వుంటాం. ఇంకా మీ దగ్గర బిల్లు తీసుకోవడమా ? మామీద దయవుంచి మా కోరికను కాదనకండి. ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మా సేవలు మీకు ఉచితమే ! " అన్నాడా హోటల్ యజమాని.
ఇంకేం చేస్తారు సోమర్సెట్ మామ్ తన కీర్తే తనకు తంటా తెచ్చాక..... !
Thursday, September 15, 2011
ఆంధ్ర ' కే ' సరి
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి బిరుదు అన్న విషయం ఆంధ్రులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రుల పౌరుషానికి ప్రతీకగా నిలిచిన ఆయనకు లబించిన బిరుదమది. ఆయనకు ఆంధ్రులలో ఎంత పేరున్నా రాష్ట్ర స్థాయిని దాటి కేంద్ర స్థాయికి చేరుకోలేకపోయారు.
కట్టమంచి రామలింగారెడ్డిగారు సి. ఆర్. రెడ్డి గా ప్రసిద్ధులు. ఆయన విద్యావేత్త, కవి, విమర్శకుడు...మీదు మిక్కిలి సంభాషణా చతురుడు. ఆయన వ్యంగ్య బాణాలు విసరడంలో దిట్ట. ఆయన నోటివెంట శ్లేషలు అలవోకగా పలుకుతాయి.
ఓసారి రెడ్డిగారు ప్రకాశం గారిని గురించి మాట్లాడుతూ ఆయన బిరుదును విరిచి ఆంధ్ర ' కే ' సరి అని అన్నారట.
Sunday, August 21, 2011
గతజన్మలో ఆవు
ఈ దృశ్యాన్ని చూసిన కృష్ణారావు గారు నవ్వుతూ " నరసింహం గారు క్రితం జన్మలో ఆవు అయివుంటారు " అన్నార్ట .
Vol. No. 03 Pub. No. 008
Thursday, August 11, 2011
పవర్ కట్
Vol. No. 02 Pub. No. 313
Tuesday, August 9, 2011
కమీషన్ పద్ధతిలో పరిపాలన

కొంతకాలం పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన పీలుమోడి పార్శీ వ్యక్తి. పార్శీలు వ్యాపార దక్షత గలవారు. అంతే కాదు నీతినిజాయితీలకు పెట్టింది పేరు. పీలుమోడి స్థూలకాయుడు. ఆయన సంభాషణలు చమత్కారాలతో నిండి వుండేది.
“ మనదేశం ఈ దుస్థితి నుంచి బయిటపడాలంటే ఒక్కటే పరిష్కారం. దేశం మొత్తాన్ని పార్శీలకు మానేజింగ్ ఏజెన్సీ పద్ధతిలో అప్పగించడమే ! మాకు కేవలం 5 శాతం కమీషన్ ఇస్తే చాలు. ప్రజలకు స్వచ్చమైన, నీతివంతమైన పరిపాలన అందిస్తాం. మాకు వ్యాపార దృక్పధమే గానీ ఆశ్రిత పక్షపాతం వుండదు. మేము వుండేదే తక్కువ సంఖ్యలో కాబట్టి కుర్చీ కోసం కుమ్ములాట కూడా వుండదు “ అన్నారు.
అప్పటి పార్శీల సంగతేమో ఇప్పుడు కొంతమంది నాయకులు మాత్రం ప్రజలు తమ పరిపాలనకు జీవితకాలపు... ఇంకా చెప్పాలంటే వంశపారంపర్య హక్కులు ఇచ్చేశారనుకుంటున్నారు. దానికోసం ప్రజలకు 5 శాతం కమీషన్ కూడా ఇచ్చేస్తారు కూడా... ఉదారంగా ! పాపం... నిజంగానే వాళ్ళకా హక్కులు ఇచ్చేస్తే పోలా ... !!!
Vol. No. 02 Pub. No. 309
Friday, August 5, 2011
కింకవీంద్ర ఘటా పంచావన
Vol. No. 02 Pub. No. 305
Thursday, July 28, 2011
క్రమాక్రమాలు
హాస్య బ్రహ్మ, గణపతి సృష్టికర్త చిలమర్తి లక్ష్మీనరసింహం గారు చెప్పిన ఓ పిట్ట కథ.......
ఒక ఊరిలో కాస్త కలిగిన కుటుంబంలోని బ్రాహ్మణుడు వేదం చదువుకున్న వారెవరైనా సరే తనింటికి వస్తే భోజనం పెడతానని ప్రకటించాడు. వేదం రాని వారికి ఆ అవకాశం లేదని కూడా చెప్పేవాడు. ఆ మాట ప్రకారమే వేద పండితులు ఎవరు తన ఇంటికి వచ్చినా లేదనకుండా భోజనం పెట్టి వారిని ఉచిత రీతిని సత్కరించి పంపేవాడు.
ఒకసారి ఒక వేసవి కాలంలో మిట్టమధ్యాహ్నం ఎండ మండిపోతున్న వేళ ఓ బీద బ్రాహ్మణుడు ఆకలి దప్పికలతో మాడుతూ ఈ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. అతని షరతులు తెలుసుకున్న ఆ బీద బ్రాహ్మణుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎందుకంటే అతనికి వేదం రాదు. అతని బాధను కూడా గుర్తించకుండా అన్నదాతయైన బ్రాహ్మణుడు ' మీకు వేదం వచ్చునా ? ' అని ఆ బ్రాహ్మణుడిని అడిగాడు. ఆకలితో బాధపడుతున్న ఆ రెండవ వ్యక్తి తనకు వేదం వచ్చునని, భోజనం చేసిన తరువాత తనను పరీక్షించవచ్చునని చెప్పాడు. గృహస్థుడా మాటలకు అంగీకరించి చాలా గౌరవంగా అతనికి భోజనం పెట్టాడు. మర్యాదలు చేశాడు. కొంతసేపు విశ్రమించి లేచిన తర్వాత పరీక్ష ఇస్తానని బ్రాహ్మణుడు చెప్పాడు. కొంతసేపు నిద్రపోయి లేచిన తర్వాత కూడా అతడు వేదం చదివే దృష్టిలో లేకపోవడం చేత గృహస్థుడు అతనిని మళ్ళీ అడిగాడు. అందుకా బ్రాహ్మణుడు సమాధానం చెబుతూ ముందు ' క్రమము ' చెపుతానని ఇలా మొదలు పెట్టాడు.
' అయ్యా ! మీరు బ్రతికి వుండగా మీ కుమారుడు చనిపోవుట అక్రమము. మీ కుమారుడు జీవించి వుండగా మీరు చనిపోవుట క్రమము ' అని పలికాడు. ఇంటి యజమాని కోపించి అతనిని కొట్టబోగా అందరూ చేరి అతనిని వారించి బ్రాహ్మణుడి యుక్తికి మెచ్చుకుని ఆకలితో వున్నవారికి అందరికీ భోజనం పెట్టడం మంచిది కానీ, వేద పండితులకే భోజనం పెడతాననడం మంచిది కాదని చెప్పి అతనిని మందలించారు.
Vol. No. 02 Pub. No. 293
నవ్వుకు కారణం !

ఒకప్పటి చైనా ప్రధాన మంత్రి చౌ ఎన్ లే ని ఒకసారి ఒక అమెరికన్ పత్రికా ప్రతినిధి కలుసుకున్నాడు. సంభాషణ ప్రారంభిస్తూ
" నేను రెండవ ప్రపంచయుద్ధం ముందూ మీ దేశానికి వచ్చాను. తర్వాతా వచ్చాను. అప్పటి చైనాకి, ఇప్పటి చైనాకి చాలా తేడా కనిపిస్తోంది " అన్నాడు.
ఆ వ్యాఖ్యకు చౌ ఎన్ లే ముఖంలో ఏ విధమైన ప్రత్యేకమైన భావం కనిపించలేదు ఆ విలేఖరికి. కమ్యూనిస్టుల పరిపాలనలో దేశం బాగా వుందని, ప్రజలు హాయిగా వున్నారని చెబుతారని ఆ విలేఖరి భావం.
కానీ చౌ ఎన్ లే
" ఏమిటి మీకు కనిపించిన తేడా ? " అని అతి మామూలుగా అడిగారు.
అప్పుడు ఆ విలేఖరి " ఆ రోజుల్లో చైనా ప్రజలు నవ్వుతూ, తుళ్లుతూ హాయిగా నవ్వుకునేవారు . ఆఖరికి రిక్షా తొక్కే వాడు కూడా స్వేచ్ఛగా జోకులు వేస్తూ మాట్లాడేవాడు. మరి ఇప్పుడు ఎవరి ముఖం చూసినా నవ్వు కనబడడం లేదు. అంతా సీరియస్ గా కనిపిస్తున్నారు " అన్నాడు.
పెట్టుబడిదారీ వ్యవస్థలోని వారికి కమ్యూనిజం అంటే చులకన భావం వుండేది. కనుకనే పెట్టుబడిదారీ దేశమైన అమెరికాకు చెందిన ఆ విలేఖరి వ్యాఖ్యలో వ్యంగం, విమర్శ వుంది. అది చౌ ఎన్ లే గమనించారు. అందుకే
" ఓహో ! ఆదా ! దానికి కారణం వుంది. గతంలో మా ప్రజల జీవనం చాలా దుర్భరంగా వుండేది. అప్పుడు ఆ కష్టాల్ని, బాధల్నీ మర్చిపోవడానికి లేని నవ్వు తెచ్చుకుని నవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అందరూ హాయిగా, ఆనందంగా వున్నారు. ఇక నవ్వు... కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ? అంతా శ్రద్ధగా, సీరియస్ గా తమ పని తాము చేసుకుపోతున్నారు. జీవితం హాయిగా గడిచిపోతోంది. ఇంతకంటే ఏం కావాలి ? ఇక నవ్వుకోవడానికి సమయం ఎక్కడిది ? "
ఆ విలేఖరి సంగతి ఇంకా చెప్పాలా ?
Vol. No. 02 Pub. No. 292
ప్రాచుర్యం
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...









