Thursday, February 20, 2020

గులాబీ అత్తరు... మునిగిన లోయ.... స్నేహ యాత్రోత్సవం.... ఇంకా....



శ్రీపాద కథలు - గులాబీ అత్తరు
దుర్మార్గుడు, లోభి అయిన దివాన్ ను ఆశ్రితులూ, రాజ బంధువులూ, రాజ పురుషులూ, పుర ప్రముఖులూ పరివేష్టించి ఉన్న సమయంలో ఖాను తన అత్తరు సీసా బిరడా తీసి గాలి వాటాన పెట్టాడు. అంతే ! వెంటనే బిరడా బిగించేశాడు. కానీ ఆ క్షణమాత్రానికే చుట్టూ వుండిన జవానులు తుళ్లిపడి మత్తెక్కినట్టు అయిపోయారు..... శ్రీపాద కథలు - గులాబీ అత్తరు

మునిగిన లోయ
ఈ చరిత్రంతటికీ వెనకాల రెండే అంశాలున్నాయి. సృష్టి – విలయం. ఆ రెండోది ఒక్కసారి తన పథకం ప్రకారంగా గానీ, ఆయాచితంగాగానీ సంభవిస్తూంటుంది. ఆలోచించి చూస్తే ఒకనాటి హరప్పా ఈనాడెక్కడుంది ? బాబిలోనియా ఏమయింది ? కాలం వాటిని చప్పరించిందంతే. రచయిత స్వరంలో కూడా వినవచ్చును..... మునిగిన లోయ


స్నేహ యాత్రోత్సవం

‘ అభిజ్ఞ ‘ స్నేహ బృంద పరిధి విస్తృతమై " ఉమ్మడి కుటుంబం " ఆకృతి సంతరించుకోవడం సంతోషకరం. ‘ అభిజ్ఞ ‘ సభ్యులు కలసి చేసిన మూడవ యాత్ర ఈ కేరళ యాత్ర. ' అభిజ్ఞ ‘ సభ్యులు ఆరుపదుల వయస్సులో చేస్తున్న తీర్థ యాత్రలా ఇవి ?....... స్నేహ యాత్రోత్సవం


ఇంకా చాలా..... ఈ క్రింది లింక్ లో.......
శిరాకదంబం 09_010 
 Visit web magazine at https://sirakadambam.com/ 

 Vol. No. 11 Pub. No. 010

Saturday, February 8, 2020

తాపీమేస్త్రి రామదీక్షితులు బి‌ఏ... నన్ను గురించి ఒక కథ చెప్పవా?.... వాగ్దేవికి స్వర నైవేద్యం... ఇంకా...


రత్తమ్మ, సుందరమ్మలు ఇద్దరూ బి‌ఏ పాసైన కొడుకులతో ఉద్యోగాన్వేషణలో ఉంటారు. రత్తమ్మ కొడుకు మన కథానాయకుడు రామదీక్షితులు బి‌ఏ. సుందరమ్మ కొడుకు పేరు అవసరం లేదనుకున్నారేమో రచయిత. అతనికి ఊరూపేరూ లేదు. చిత్రం ఏమిటంటే కొడుకుల ఉద్యోగాల గురించి తల్లులు ఇద్దరూ మాటలాడుకోవడమే కానీ పురుష పాత్రలు మాటలాడరు. స్త్రీ పాత్రలతోనే ఈ కథను నడిపించడంలో శ్రీపాద వారు తమదయిన కొత్త ఒరవడిని ప్రదర్శించడం గమనార్హం.
..... ' శ్రీపాద కథలు ' లో " తాపీమేస్త్రి రామదీక్షితులు బి‌ఏ " పరిచయం.

 " నా గురించి ఒక కథ చెప్పవా? " అని ఒకసారి కుముదం అడిగినప్పుడు " నీలాంటి వాళ్ళ గురించి చెప్పడానికి ఏముంటుంది ? " అని కథకుడు తేలికగా తీసి పారేస్తాడు. కుముదం మౌనం గా ఉండిపోతుంది. వయసుతో పాటు స్నేహం పెరుగుతూ వస్తుంది. కానీ కుముదం పట్ల కథకుడి అభిప్రాయంలో మార్పు రాదు. వారి మధ్య అనేక సార్లు సంభాషణలలో జీవితం గురించీ " దాస్యం " గురించి కుముదం చేసిన ప్రతిపాదనలని మేధావంతుడని తనని తాను భావించుకునే కథకుడు సరిగ్గా పట్టుకోలేకపోతాడు.
.... ' కథావీధి ' లో బుచ్చిబాబు " నన్ను గురించి ఒక కథ చెప్పవా? " పరిచయం.

మేడ గది తలుపులు తీసి భయంభయంగా దిగుతున్న సుకుమారి రాచపిల్లను, మెట్ల మీద నుంచి, తన మధుర స్వరంలోకి బదలాయించి, సుతిమెత్తగా క్రిందకు దింపినవాడు ఘంటసాల. పరిశీలనగా విని చూడండి. ఆమె దిగే దృశ్యం, ఆయన గొంతులోంచి కనిపిస్తుంది. కవిత్వం తెలియని వాళ్ళకి, కరుణశ్రీ తెలియనివాళ్ళకి కూడా ఆయనెవరో, ఎంతటి మహనీయ కవో తెలియచేసిన వారు ఘంటసాల.
...... ఘంటసాల వర్థంతి సందర్భంగా " వాగ్దేవికి స్వర నైవేద్యం "

ఇంకా.... చాలా.... ఈ క్రింది లింక్ లో......
శిరాకదంబం 09_009

 Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 11 Pub. No. 009
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం