తెలుగు చిత్ర రంగం తొలి రోజుల్లో మద్రాస్ లో మాత్రమే సినిమా స్టూడియోలు ఉండేవి. తెలుగు వారి హస్తం వాటిలో ఉన్నా తెలుగు గడ్డ మీద స్టూడియో లు లేవు. ఆ తరుణంలో 1936 లో రాజమండ్రిలో నిడుమర్తి సూరయ్య గారనే ఆయన ' దుర్గా సినీ టోన్ ' అనే పేరుతో ఒక స్టూడియో నిర్మించారు. ఆంద్ర దేశంలో అదే తొలి ఫిలిం స్టూడియో. ఆ స్టూడియో లో కోడేరు రాజు, పుష్పవల్లి జంటగా సంపూర్ణ రామాయణం చిత్రాన్ని నిర్మించారు. అటు తర్వాత కొన్ని చిత్రాలు నిర్మించినా ఎక్కువరోజులు ఆ స్టూడియో నిలదొక్కుకోలేకపోయింది. చిత్ర ప్రదర్శనలను ప్రజలకు చేరువ చెయ్యడంలో సూరయ్య గారి కృషి చెప్పుకోదగ్గది. సంపూర్ణ రామాయణం అణా కానీ కి, ఆ మరుసటి సంవత్సరం నిర్మించిన దశావతారాలు ఒక్కొక్క అవతారం ఒక కానీ చొప్పున చూపిస్తానని ప్రచారం చేసి ప్రజల్ని ఆకర్షించారు.
తెలుగు చిత్ర రంగంలో తొలి తరం దాదాపుగా తరలిపోయింది. ఆ జ్ఞాపకాలను నింపుకున్న మలితరంలో కూడా ఒ

1 comment:
hai friends
nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
ee link lo choosi me comments teliyajeyandi.
http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html
Post a Comment