
హాస్య కవులు, రచయితలు ప్రతి సందర్భంలోనూ హాస్యం ఒలికించగలరు. ఓసారి కాకినాడలో తూర్పుగోదావరిజిల్లా రచయితల మహాసభలు జరుగుతున్నాయి. ఆ రోజు సభలలోని అంశాలన్నీ పూర్తయ్యాయి ఒక్క సంతాప తీర్మాన కార్యక్రమం తప్ప. అది మొదలయ్యేటప్పటికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఆ సంవత్సరం మరణించిన ప్రపంచ కవులందరికీ సంతాపాలు ప్రకటిస్తున్నారు. అంతకంతకూ జాబితా పెరిగిపోతోంది. ఆ సభకు ప్రముఖ రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి గారు అధ్యక్షత వహించారు. ఆయన చాలా సేపు ఓపిక పట్టారు. ఇక ఆగలేక ఆ జాబితా తయారుచేస్తున్న వారితో " సభ ముగిద్దామంటే మీరు వినకుండా ఇప్పుడు దివంగత పెద్దల జాబితా తయారుచేస్తున్నారు. వంటలు అయిపోయాయి. పదార్థాలన్నీ చల్లారిపోతున్నాయి. మీరింకా ఆలస్యం చేస్తే ఆ దివంగతుల జాబితాలో నా పేరు కూడా చేర్చాల్సి ఉంటుంది " అన్నారు, అలా తన ఆకలి కోపాన్ని హాస్యంగా పలికిస్తూ !
Vol. No. 01 Pub. No. 118
No comments:
Post a Comment