ఇవన్నీ ఒక ఎత్తు. తొలి చిత్ర నిర్మాతగా ఆమె చేసిన సాహసం మరో ఎత్తు. 1935 లోనే చిత్ర నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. బి.వి.రామానందం ( ఎస్వీ రంగారావు మేనమామ ), తుంగల చలపతిరావు లతో కలిసి ' భారత లక్ష్మి ఫిలిమ్స్ ' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి కలకత్తాలో " సతీ సక్కుబాయి " అనే చిత్రాన్ని నిర్మించింది. తన నాటక రంగ సహచరులందరినీ స్వంత ఖర్చులతో కలకత్తాలోనే ఉంచి అందరం కలిసి పని చేద్దామని నచ్చజేప్పింది. తామందరూ కష్టపడి పనిచేసి ఎవరికో లాభాలు తెచ్చిపెట్టే కంటే ఆ లాభాలేవో మనమే పంచుకుందామని వారందరినీ వప్పించి ఆ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో కోటిరత్నం సక్కుబాయిగా, తుంగల చలపతిరావు కృష్ణుడిగా నటించారు.
ఇప్పటి కళాకారులు, సాంకేతిక నిపుణులు కూడా ఆవిడ అనుసరించిన పధ్ధతిని అనుసరిస్తే శ్రమ దోపిడీని అరికట్టి తమ ప్రతిభను ప్రదర్శించ వచ్చు. ఆ రకంగానైనా ఆరోగ్యకరమైన చిత్రాలు వచ్చే అవకాశం ఉంది.
2 comments:
rao garu what you have posted is an invaluable peace of information.thanks a lot for the same
Annonymous garu !
Most welcome. I am very happy if you can mention your name in future comments.
Post a Comment