నలభై నాలుగేళ్ళ ప్రాయం ఆ పాటకు
నూరేళ్ళ జ్ఞాపకం తెలుగు శ్రోతలకు
కోదండపాణి అందించిన బాణీ
చేసింది పాటలలో వైవిధ్యానికి బోణీ
ఒక కొత్త స్వరం... ఒక కొత్త ఊపు తెలుగు పాటకి
ఒక కొత్త అనుభూతి... ఒక కొత్త అనుభవం తెలుగు శ్రోతకి
అప్పటినుంచి ఇప్పటిదాకా అదే గళం
వినిపిస్తోంది మధురగీతాల్ని అదే స్వరం
1966 వ సంవత్సరంలో ప్రముఖ సంగీత దర్శకులు ఎస్. పి. కోదండపాణి గారు పరిచయం చేసిన బాలసుబ్రహ్మణ్యం ఇంతింతై వటుడింతై బాలుగా తెలుగువారందరికీ సంగీతాత్మీయుడై తెలుగు చరిత్రలో తనకొక సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.
బాలు స్థానం పటిష్టం కావడానికి ఆయన అవిరళ కృషితో బాటు ఎస్. పి. కోదండపాణి గారి కృషి కూడా చాలా ఎక్కువగా పనిచేసింది. ఆయన బాలు స్వరాన్ని తన సంగీతంలో పరిచయం చేయడంతో బాటు చిత్ర రంగానికి పరిచయం చేయడానికి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఆ గళంలో పాట నిలబడడానికి అంతే శ్రద్ధ తీసుకున్నారు. ఆయన తొలి పాటను సంగీత దర్శకులందరికీ వినిపించి, అతనికి అవకాశాలిమ్మని కోదండపాణి గారే అడిగేవారట. బాలు గారికి ఆర్థికంగా సహాయపడడానికి తన దగ్గర సహాయకుడిగా పనిచేయించుకునేవారట. ఇతర సంగీతదర్శకుల దగ్గర బాలు గారు పాడిన పాటల్ని ప్రత్యేకంగా వెళ్ళి వినేవారట. పాటలో పొరబాట్లను క్షమించేవారు కాదట. చిన్న తప్పు చేసినా ఎత్తి చూపేవారట.
బాలు గారి భవిష్యత్తుకు ఎంత ఆరాట పడ్డారో ఆయన ఆరోగ్యం కోసం కూడా అంతే ఆరాటపడ్డారు కోదండపాణి గారు. ఒకసారి బాలు గారు కష్టబడి సైకిల్ తొక్కుకుంటూ కోడంబాక్కం వంతెన మీద వెడుతుంటే అప్పుడే కారు మీద వెడుతున్న కోదండపాణి గారు చూసారు. బాలు గారిని ఆపి " ఏమిటయ్యా పంతులూ ! ఈ ఎండలో సైకిల్ మీద విహారం ఏమిటీ ? బుద్ధిలేదూ ? ఆరోగ్యం బాగుంటేనే పాట బాగుంటుంది. బస్సులో వెళ్ళు. ఇకెప్పుడైనా సైకిల్ మీద కనిపించావో ఊరుకోను " అని మందలించారట. ఆయన శ్రద్ధ, కోరిక ఫలించి తెలుగు వారికి మరో అద్భుతమైన గాయకుడు లభించాడు.
బహుముఖ పజ్ఞాశాలిగా ఎదిగిన బాలు గారు నలభై నాలుగు సంవత్సరాల క్రితం తొలి పాట పాడిన రోజు.... ఈరోజు.....
ఆ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పాట ఇక్కడ ..............
Vol. No. 02 Pub. No. 083
Wednesday, December 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
ప్రాచుర్యం
-
* “ దూరపు కొండలు నునుపు ” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నా...
-
* శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీ...
-
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది .......................................
-
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. మా స్టూడియో నుంచి కబురు వచ్చింది, ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరు...
-
ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html దానిలో ' గుజ్జనగ...
-
తెలుగు తెరకు అతడే కృష్ణుడు తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు ........ అతడే రా...
5 comments:
రావు గారు. చక్కగా గుర్తు చేసారు. ఇది ఎస్.పి. పాడిన తొలిపాట-"ఏమి ఈ వింతమోహం". పద్మనాభం గారి స్వంత చిత్రం శ్రీశ్రీశ్రీమర్యాదరామన్న నుండి. 1967 అనుకుంటాను. ఈ పాటకు సహగాయనీ గాయకులు -పి.సుశీల, కె.రఘురామయ్య,పి.బి.శ్రీనివాస్.
Good to celebrate the 44th annual day of a song.
* సూర్యనారాయణ గారూ !
1966 వ సంవత్సరం అండీ ! ధన్యవాదాలు.
* మాధురి గారూ !
ధన్యవాదాలు
great sp balasubramanyam garu
ధన్యవాదాలు Telugu Movie News
Post a Comment