మన చుట్టూ వుండే చాలామందిలో మొదటి తరగతికి చెందినవారే ఎక్కువగా

అబ్రహాం లింకన్ అధ్యక్షునిగా పనిచేస్తున్న కాలంలో ఓసారి పురవీధుల్లో గుర్రపు బగ్గీలో వెడుతున్నారు. ఆయన వెంట ఆయన మిత్రుడోకరు కూడా వున్నారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత దారిలో వారికొక ముసలి నీగ్రో ఎదురయ్యాడు. మాసిపోయి, చినిగిపోయిన దుస్తులతో శరీరమంతా దుమ్ముకొట్టుకుపోయి దీనంగా వున్నాడు. అధ్యక్షుణ్ణి చూడగానే ఆ నీగ్రో వినయంగా తన చిరిగిన టోపీని తల మీదనుంచి తీసి అభివాదం చేశాడు. వెంటనే లింకన్ ఆ బగ్గీలోనే లేచి నిలబడి తన టోపీ తీసి ఆ నీగ్రోకు ప్రత్యభివాదం చేశాడు.
ఇది లింకన్ మిత్రునికి ఆశ్చర్యం కలిగించింది. " అదేమిటి లింకన్. నువ్వు ఈ దేశాధ్యక్షుడివి. ఒక నీగ్రో ముసలి వాడికి నువ్వు అభివాదం చెయ్యడమేమిటి ? " అని అడిగాడు.
దానికి అబ్రహాం లింకన్ " మర్యాద, మన్ననలో నాకంటే ఎవరూ ఎక్కువ కాకూడదని నా సిద్ధాంతం. ఇప్పుడు ఆ నీగ్రోకు నేను ప్రత్యభివాదం చెయ్యకపోతే నాకంటే అతనే మర్యాదస్తుడు, సంస్కారవంతుడు అవుతాడు. ఒక సామాన్య వ్యక్తి దేశాధ్యక్షుని కంటే గొప్ప సంస్కారవంతుడు అనిపించుకుంటే ఇంక ఆ పదవికేమి గౌరవం వుంటుంది ? ... ఆ దేశానికేమీ గౌరవం వుంటుంది ? అందుకే అలా చేశాను " అన్నారట.
ఈ స్థానంలో ఒక్కసారి మన నాయకులను ఊహించండి.
Vol. No. 02 Pub. No. 281
No comments:
Post a Comment