Tuesday, March 9, 2010

తొలి నేపథ్య గానం

   1931 లో భారత చిత్రాలకు మాటలోస్తే నేపథ్యగానం మాత్రం 1934 లో ఆరంభమైంది. కెమెరామన్ గా ప్రారంభించిన నితిన్ బోస్ ( దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత ) తాను దర్శకత్వం వహించిన  ' భాగ్య చక్ర ' బెంగాలీ చిత్రంలో తొలిసారిగా నేపథ్యగానాన్ని ప్రవేశపెట్టారు. ఆ చిత్రం ' దూప్ చావ్ ' గా హిందీలో అదే సంవత్సరం రూపొందించారు. మొదటి పాటను కె. సి . డే, పాల్ ఘోష్, సుప్రభా సర్కార్ పాడారు.  


తెలుగులో మాత్రం పది సంవత్సరాలు ఆలస్యంగా 1944 లో నేపథ్య గానం ఆరంభమైంది. అప్పటివరకూ నటీనటులు వారి పాటలను వారే లైవ్ లో పాడుకునేవారు. తర్వాత కాలంలో సుందరదాసుగా ప్రసిద్ధి పొందిన ఎం.ఎస్. రామారావు గారు తొలి నేపథ్య గీతాన్ని ఆలపించారు. ఆ చిత్రం ' తాసిల్దారు '. వై. వి. రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆయనతో బాటు భానుమతి, కమలా కొట్నీస్, బలిజేపల్లి మొదలైన వారితో బాటు ఎం. ఎస్. రామారావు కూడా నటించారు. హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి సంగీత దర్శకత్వం వహించారు. నండూరి సుబ్బారావు గారి ఎంకి పాట ' ఈ రేయి నన్నొల్ల నేరమా '  ఎం. ఎస్. రామారావు గారు పాడారు.

గమనిక : ఎం. ఎస్. రామారావు గారి తొలి పాట ఎవరి దగ్గరైనా వుంటే వినిపిస్తారా ?

Vol. No. 01 Pub. No. 218

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం