Friday, January 29, 2010

తెలుగు పాటకు చిరునామా వేటూరి



తెలుగు పాటకు ఆయన చిరునామా
తెలుగు పాటే ఆయనకు చిరునామా

సంస్కృత భూయిష్టమైన సమాసాలను అందంగా పొదిగి
సమోసాలాంటి పాటగా మార్చి అందించినా

లలిత శృంగార భావాలను మనోహరంగా పేర్చి
అందమైన పాటగా మలిచి అలరించినా




మొరటు పదాల జానపద పలుకులను నేర్పుగా అల్లి
మసాలా కూర్చి సగటు ప్రేక్షకుడ్ని మెప్పించినా

జీ్వితంలోని బాధల్ని, విషాదాల్ని గాయకుల స్వరాల్లో నింపి
రాలిపోయే పువ్వుల్ని వర్ణించి ప్రేక్షక శ్రోతల గుండెలు పిండి ఏడిపించినా





అది
వేటూరికే చెల్లింది.

ఆయన పుట్టుకే కవి




ఆయన బీజం కవుల కుటుంబంలోనిది
అందుకే ఆయనకు కవిత్వం వెన్నతో పెట్టిన విద్య
అందుకే పాట ఆయనకు అలవోకగా పట్టుబడింది

ఆయన వృత్తి తొలుత పాత్రికేయుడు
అందుకే సమాజంలోని వైరుధ్యాలు తెలుసాయనకు
అందుకే ఆయన పాటలో అన్ని వైరుధ్యాలు ప్రతిబింబించాయి




సహజసిద్ధంగా వచ్చిన భావ జాలం, దానికి తోడైన పాండిత్యం
పూవుకు తావి అబ్బిన చందంగా భాసించాయి
మూడు దశాబ్దాలుగా మనల్ని అలరిస్తున్నాయి

విశ్వనాథ, తిరుపతి వెంకటకవులు, సముద్రాల సీనియర్ లాంటి
మహామహుల శిష్యరికం మరింత వన్నె తెచ్చి
తెలుగు వాకిట సిరిమువ్వ అయి చిందేసింది




1936 లో పుట్టిన వేటూరి సుందరరామమూర్తి పేరు
వెండితెరకెక్కి సరిగ్గా 36 యేళ్ళవడం యాధృచ్చికం
దానికి గురువు గారి ' ఓ సీత కథ ' వేదిక అయింది

అక్కడనుంచి వేసిన ప్రతి అడుగూ ఒక మైలు రాయే
పలికించి ప్రతి పాటా అబాలగోపాలానికి వీనులవిందే
అందుకే ఆ పాట జాతీయ స్థాయిలో పరిమళించింది



ఆ కలానికి విశ్రాంతి లేదు,,.. ఉండకూడదు
మరిన్ని మధుర గీతాల్ని అందించాలి
మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

నేడు వేటూరి సుందరరామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలతో .........

Vol. No. 01 Pub. No. 173

8 comments:

ఆమ్రపాలి said...

అద్భుతం గా వ్రాసారండి వేటూరి వారి గురించి ..వారికి నా

జన్మదిన శుభాకాంక్షలు

- ఆమ్రపాలి

భావన said...

చాలా బాగా రాసేరు వేటురి గారి గురించి. ఆయన కు జన్మ దిన శుభాకాంక్షలు.

సిరిసిరిమువ్వ said...

చాలా బాగా వ్రాసారు. ఆయన వ్రాస్తున్న కాలంలో మనం పుట్టినందుకు నిజంగా గర్వించాలి.

వేటూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

పరిమళం said...

వేటూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

నిరంజన్ said...

ఆత్త్రేయ,ఆరుద్ర,శ్రీ శ్రీ లాంటి మహా రచయితల రచనా ప్రవాహాన్ని తట్టుకొని తనదైన ఒక నూతన ఒరవడిని స్ర్ర్షుష్టించిన వేటూరికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయన వ్రాసిన పాటల్లో తెలుగుదనం ఉట్టిపదుతుంది.పల్లె పదాల అందాలు కళ్లకు కట్టినట్లుగ కనబదతాయి.జనపదాల సొయగాలు హొయలు పోతాయి.నీలి నీలి ఊసులు చెవుల్లో వినిపిస్తాయి.సాంప్రదాయ సంగీత కీర్తనలు,సంస్క్రత పదాలు సామాన్యులను అలరించలేవు అన్న వాదాన్ని "శంకరాభరణం" లో తన పాటల ద్వారా తప్పని నిరూపించారు."సిరి సిరి మువ్వలో" వారు వ్రాసిన"ఝుమ్మంది నాదం ,సై అంది పాదం,తనువూగింది ఈ వేళా, చెలరేగింది ఒక రాసలీల" అనే పల్లవి ఆయన వ్రాసిన ప్రతిపాట విన్నప్పుడు కలిగే అనుభూతి."ఆందంగా లెన ,అసలేం బాలెన,నీ ఈడు జోడు కానన,అలుసైపోయాన,అసలేమి కానన,వెషాలు చాలన" అని ప్రియుడి కోసం తపించే ప్రియురాలి తపన చెప్తూనే "మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే,అతనికి నువ్వునచ్చావో లేదొ, ఆ షుభ గడియ వచ్చేనొ రాదొ" అని హెచ్చరించినా వారికే చెల్లు.నవ్వింది మల్లె చండు ,"నచ్చింది గర్ల్ ఫ్రెండు ,దొరికనే మజగా చాన్సు ,జరుపుకో భలే రొమన్సు,యురెకా తకమిక,నీముద్దు తీరె దాక "అని ప్రియురాలి ప్రేమను పొందిన అనందాన్ని"స్నేహితుడా స్నేహితుడా,రహస్య స్నేహితుడా,చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా " అని ప్రియున్ని తలుచికునే ప్రియురాలి అలోచనలు మనకు అందిచింది ఆయనే."నవమి నాటి వెన్నల నెను,దశమి నాటి జాబిలి నెను,కలుసుకున్న ప్రతిరెయి,కార్తీక పున్నమి రెయు""మానసవీణ మదు గీతం,మన సంసారం సంగీతం' అని సంసారంలొని సరిగమల్ని పలికిచింది అయనే ."క్రుషి ఉంటే మనుషులు ఋషులౌతారు,మహాపురుషులౌతరు,తరతరాలకు వెలుగౌతారు,ఇలవెల్పులౌతరు" అని తట్టిలేపింది వారె."ఆకు చాటు పింద తడిసె,కొమ్మ చాటు పువ్వు తడిసె" అని కొంటె తనాన్ని నేర్పింది ఆయనే."ఏ కులము నీ దంటే ,గొకులము నవ్వింది,మాధవుడు,యాదవుడు మాకులము పొమ్మంది." అని కులాలు లేవు అని చెప్పందీ వారె."పుణ్యము పాపము ఎరుగని నేను,పూజలు సేవలు ఎరుగని నెను,ఏ పూలు తేవాలి నీపూజకు,ఏ లీల సేయలి నీ సెవలొ,శివ శివ శంకర భక్తవ శంకర ,శంభో హర హర నమో నమో" అని ఒక అమాయక కొయదొర భక్తిని "ఓంకర నాదాలు సందానమౌ రాగమే శంకరాభరణము " అని పండితుడి భక్తిని చెప్పింది ఆయేనె."ఛినుకులా రాలి నదులుగా సాగి,వరదలై పొంగి,హిమములై రాలి,సుమములై పూసె,నీప్రేమ నా ప్రేమ" అంటూ ప్రేమ ప్రవాహంలో ప్రయణింపచేసింది వారే."నిన్నటి దాక శిలనైనా ,నీ పదము సొకినే గౌతమి నైన" అని అన్నా,అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ ,అందరికీ అందనిదీ పూసిన కొమ్మ "అని ఒక సహజమైన పదాలతో అలరించిది వారె."ఆమని పాడవె హాయిగా,మూగవై పొకు ఈ వేళ," అని "అకాశానసూర్యుడుండడు సంధ్యవెళకే,చందమామకి రూపముండదు తెల్లవారితే,ఈ మజిలీ మూడునాళ్ళు ఈ జీవ యాత్రలో,ఒక ఒపూటలొనా రాలు పువ్వులెన్నో,నవ్వవే నవ మల్లిక ,ఆశలే అందలుగ " అంటూ ధైర్యాన్నిచ్చింది వారె."వెణువై వచ్చాను భువనానికి,గాలినై పోతాను గగనానికి ,మాటలన్నీ మౌనరాగం వాంచలన్నీ వాయులీనం " అని చెప్పిన అయనే "అకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమావిరహమో గానమో ,వినిపించు నా చెలికి మేఘసందేశం" అని అయనే అన్నారు .బహుశా వారు వ్రాసిన ప్రతి పాట మేఘసందేశమనే యేమో.

Anonymous said...

విశ్వనాథ్ గారికి, రాఘవేంధ్రరావు గారికి సమానంగా హిట్ సాంగ్స్ ఇవ్వటం కేవలం ఆయన వల్లనే సాధ్యం.
"ఓంకారనాదాను సంధానమౌ" అన్నా "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" అన్నా
నవరసాలు తన పాటల్లో చూపించటం ఆయనకే చెల్లుతుంది.
అవును. సుశీల గారికి లాగా వేటూరి గారికి సన్మానం ఏమీ లేదా?

SRRao said...

* ఆమ్రపాలి గారూ !
* భావన గారూ !
* సిరిసిరిమువ్వ గారూ !
* పరిమళం గారూ !

ధన్యవాదాలు

* నిరంజన్ గారూ !

వేటూరి వారి గురించి ఎంతో రాయాలనుకున్నాను. కానీ క్లుప్తంగా ఎలా రాయాలో తోచక నాకు తోచిన మాటల్లో అక్షరాంజలి సమర్పించుకున్నాను. కానీ ఆయనకు మీరు సమర్పించిన గీతాంజలి అద్భుతం. అది కూడా నా బ్లాగులో మీరు రాయడం............కృతజ్ఞతలు.

* బోనగిరి గారూ !

నిజమేనండి. ఆయనకోసం కాదు. మన కోసం, మన తెలుగు పాట కోసం అద్భుతమైన సన్మానం జరగాలి. ఆయన పాట వల్ల లాభపడిన పెద్దలెవరైనా పూనుకుంటే బాగుంటుంది. చూద్దాం ! ఎవరికైనా ఈ ఆలోచన వస్తుందేమో !

నిరంజన్ said...

ధన్యవాదాలు మీరు అందించిన ప్రశంస నన్ను మరింత,మరిన్ని విషయాలు వ్రాయటానికి తొడ్పడుతుంది.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం