Saturday, January 16, 2010

ధుమాలమ్మ ఓఘాయిత్యం

నేను : ఆవిడ నూతులో పడాలని అదుగో ఇదుగో అని ఆర్నేల్లనుంచి పట్టుట. వెనుక వీళ్ళింట్లో నుయ్యి పడడానికి ఎంతమాత్రం వీలైంది కాకపోబట్టి అది పూడిపించేసి, ఆవిడ ఇప్పుడున్న నుయ్యి దింపించిందని పుకారు. నుయ్యి ఇరుకైపోయి మనిషి ప్రాణాలు మధ్యదార్లోనే పోతే, జల మరణ పుణ్యం ప్రాప్తించదని ఆవిడ మతం.


అతను : వెనకటికి పూర్వసువాసిని తన ఆడ పడుచు మీద తట్టుగా లేసుగోచ్చి తమరి దొడ్లో ఉన్న వరల నూతిలో దూకపోయి పైనే చిక్కడి రుకుంది, ఒట్టి పొడుం బిరడాలాగ. అప్పుడు, ఎండు కొబ్బరి కాయ పెంకు బద్దలు కొట్టినట్టు పై వరలన్నీ బద్దలు కొట్టి ఆవిణ్ణి విడిపించారట.


నేను : వెనుక, ఈవిడ చలి అని కొన్నాళ్ళూ, ట్టుబండలని కొన్నాళ్ళూ, కాలు బెణికిందని కొంతకాలం, మొగుడు ళ్లో లేడని కొన్నిరోజులూ జాప్యం చేసిందటగానీ, మధ్య చాలామంది పరిచయులతో రూడిగా పడతానని చేబుతోందట. పైగా, ఎక్కడా చెప్పద్దని ప్రతివాళ్ళచేతా కేటాయింపుగా చేతులో చెయ్యి వేయించుగుని, ఊరందరితోనూ తనే చెప్పిందట.


అతను : అంతమంది పెద్దల దగ్గిర తనే చేసిన శపథం తను నిలబెట్టుగో లేకపోతే, మళ్ళీవెళ్లి వాళ్ళమొహం ఎల్లా చూడడం అని ఆవిడ భయం అయి ఉంటుంది. అదీ గాక, వాళ్ళంతా తనని ఎంతమాత్రం స్త్రీత్వం గానీ, మాట నిజాయితీ గాని లేని వ్యక్తి కిందగట్టి తేలిక చేస్తారని ఆవిడ సంకల్పం బహుశా.

నేను : ఏమో ! ఆవిడ ఎప్పుడో ఓఘాయిత్యం చేస్తుందనుకుంటాను మామా

అతను : నే అల్లా అనుకోను. ఆయన అల్లా వెనక్కి లాగుతున్నాకొద్దీ ఆవిడ అల్లా ముందుకి సాగుతూంటుంది. లాగుడు లేని సాగుడు ఉండదు. తెగసాగుడు అంతకన్నా ఉండదు. కొందరు దెబ్బలాటల్లో మధ్యవర్తులు ఆపు చేస్తూన్నకొద్దీ, ఎదర పార్టీ మీద ఎగురుతుంటారు. అవతల్నించి తగిలే దెబ్బలు ఎల్లానూ ఉండవని వాళ్లకి తెలుసును గనుక, అయ్యా తీర్చిన కొద్దీ అములు ఎక్కువ !

నేను : నిజమేస్మీ. కొందరు రోగులు ఇంట్లో ఉరుకోమనే వాళ్ళు ఉంటున్న కొద్దీ మూలుగు అధికం చేస్తుంటారు. అంచేత, ఆవిణ్ణి ఎవరేనా నూతులోకి గెంటాలిగాని, ఆవిడ ఉరకదు, నాదీ పూచీ.

ఒక సగటు మధ్య తరగతి గృహిణి తన భర్త బాధ్యతా పట్టకుండా రికామీగా తిరుగుతూంటే భరించలేక తన కోపాన్నీ, ఆక్రోశాన్నీ వెళ్లగక్కే సందర్భమది. ఆవిడ పేరు ధుమాలమ్మ. ఆవిడ భర్త పేరు సరప్ప. ఇద్దరికీ ఒక్క నిముషం పడదు. వాళ్ళింట్లో నిత్యాగ్నిహోత్రమే !

అందుకే ఆవిడ ఓసారి నిజంగానే నూతిలోకి ఉరికి భర్తను తిడుతున్నపుడు ఆయనంటాడు....

' నువ్వు నీళ్ళలో మండే జ్యోతివే ! కానీ మొగుణ్ణి తిడుతున్నావ్, అనుభవిస్తావ్ లే ' అని.

అప్పుడావిడ ' అయ్యా వింటున్నారా ! మొగుడయేది, వారయేది, వీరయేది, నాది ఇంకోరి చేత మాట పడే ఘటం కాదు. మరేం చెప్పద్దూ ! మా వంశం మహా అభిమానం గల వంశం. అందులో నాకు మహా రోషం. మంచికి మంచిదాన్నేగానీ, ఆజ్ఞలు అధికారాలు నా దగ్గర సాగవ్ ' అని ఖరాఖండీగా చెప్పేస్తుంది.

భర్తతో ఆవిడెంత విసిగిపోయిందో అర్థమయింది కదా ! భర్త మీద కోపం వచ్చినపుడల్లా ఆవిడ ఉపయోగించే ఆయుధం ఆత్మహత్య. అది కూడా నూతిలో దూకడం. విధంగా భర్తని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చెయ్యగలుగుతున్నానని ఆవిడ భావన.

కానీ మానవుడు చలించడు. అందుకే ఆవిడ నూతిలో దూకినపుడు ఆవిణ్ణి కాపాడడానికి ప్రయత్నిస్తున్న వారితో తాపీగా

' నిచ్చెన వెయ్యండి. మహా చక్కగా వస్తుందీ పెళ్లికూతుర్లాగా ! ' అంటాడు.

దాంతో ఆవిడ కోపం నసాళానికి అంటింది. చెడామడా తిట్టి పోసింది. చివరకు పెంపుడు కూతురు బాధ చూడలేక ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుంటుంది.

ఆవిణ్ణి రక్షించడానికి నూతిలోకి దిగినతను ' ధుమాలమ్మ గారూ ! మీకు దణ్ణం. మీ సాటి ఏలోకంలోనూ లేరు. నే బాఘా ఎరుగుదును. దయచేసి నిచ్చెన ఎక్కండి ' అని బ్రతిమలాడ్తాడు.

కొంచెం బెట్టు చేస్తూ ' మీరంతగా పట్టుబడితే నేను ఏం జెప్పనూ ! అల్లాగే ! నిచ్చెన మెట్టు ఘట్టిదేనా నన్నూ, నిచ్చేన్నీ కూడా ఈడవాలేమో, తాడు కాస్త జమిలిగా ఉండేది తేకపోయారూ ! ' అంటుంది.

ఆయనకు ఒళ్ళుమండి ఆవిడ నూతిలోంచి బయిటకు వచ్చేదాకా ఊరుకుని ' ఇంత తాపత్రయంగల ఘటానివి ఎందుకు పడాలమ్మా అసలూ ' అంటాడు.

మొత్తానికి ఎలాగయితే అన్ని ఏళ్ళ ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం అర్థంతరంగా ముగుస్తుంది. భర్తను బెదిరించడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా నిజంగా అయితే ఆవిడ ఎప్పుడూ దూకలేదు.

ప్రతీసారి ఆవిడ దూకుతానని నూతి దగ్గరకు వెళ్ళడం, ఒక ప్రక్క భర్త, మరో ప్రక్క పెంపుడు కూతురు పట్టుకుని బ్రతిమాలి తీసుకు రావడం మామూలయిపోయింది. మరి ఇప్పుడు ఆవిడకి నూతిలో దూకేసేం ధైర్యం ఎలా వచ్చింది ?

ఎలాగంటే ...................

ఆరోజు కూడా ఆవిడ నూతిగోడ మీదనుంచి లోపలకు వంగుని యధావిధిగా తనను పట్టుకున్న భర్త, కూతురు చేతుల్లోంచి పెనుగులాడుతూ హంగామా సృష్టిస్తోంది.

భర్తకు విసుగొచ్చి " పోన్లేవే, ఇంతకంటే నన్ను చావమన్నవా ఏమిటీ " అంటూ చెయ్యి వదిలెయ్యడంతో పట్టుదప్పి నూతిలో పడిపోయింది.

అదీ ' ధుమాలమ్మ ఓఘాయిత్యం ' కథ.

హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వర రావు గారు రాసిన కథలో అడుగడుగునా ఆయన మార్క్ హాస్యం తొణికిసలాడుతుంది. మధ్య తరగతి మనస్తత్వాలకు హాస్యపు తళుకులు అద్ది కథ ఇది. హద్దులు దాటని సున్నితమైన హాస్యం పాఠకుల్నిగిలిగింతలు పెడుతుంది.

భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం, ఉద్రేకాలకు లోను కావడం, ఆత్మహత్యలకు పాల్పడడం కొత్త విషయం కాదు. కానీ ఎంత ఆవేశపడినా, ఎదుటి వారిని భయపెట్టడానికి ఇటువంటి హంగామాలను సృష్టించినా వారికి సాధారణంగా సంసార ఝంఝాటం, పిల్లల బాధ్యతలు అడ్డు పడతాయి. కానీ ప్రయత్నాలు శృతి మించితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.

విషయాన్ని సీరియస్ గా పాఠంలా కాకుండా ఆహ్లాదకరమైన శైలిలో రాసారు భమిడిపాటి కామేశ్వర రావు గారు.

Vol. No. 01 Pub. No. 159

5 comments:

Anonymous said...

లాగుడు లేని సాగుడు ఉండదు. తెగసాగుడు అంతకన్నా ఉండదు.

Wonderful words. :-)

-- Vinay Chaganti

Anonymous said...

good one

Anonymous said...

thanks chadvutunte chaala saradaaga vundi.

Padmarpita said...

సరదాగా సాగిందండి మీ టపా!

SRRao said...

* వినయ్ గారూ !
* అజ్ఞాత గారూ !
* చంద్రలేఖ 45 గారూ !
* పద్మార్పిత గారూ !

అందరికీ ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం