Friday, February 18, 2011

తొలి తెలుగు చిత్ర కథానాయిక - జవాబులు

   కనుక్కోండి చూద్దాం - 37 - జవాబులు  


 ఈ ప్రక్క ఫోటోలో వున్నది తొలి తెలుగు చిత్ర కథానాయిక.
 1 .  ఆమె పేరేమిటి ?
 జవాబు : సురభి కమలాబాయి

 2 . ఆమె కథానాయికగా నటించిన ఆ చిత్రమేది ?
 జవాబు : తోలి తెలుగు టాకీ ' భక్త ప్రహ్లాద ' ( 1931 ). అంతే కాదు ఆ తర్వాత వరుసగా 1932 లో పాదుకా పట్టాభిషేకం, శకుంతల తో వరుసగా మూడు చిత్రాలలో నటించి హేట్రిక్ సాధించింది.

రంగస్థలం మీద తిరుగులేని సురభి కుటుంబానికి చెందిన ఆమెకు జన్మమిచ్చింది అక్షరాలా రంగస్థలమే ! ఆమె తల్లి వెంకుమాంబ కూడా రంగస్థల నటి. ఓసారి నాటక ప్రదర్శన జరుగుతుండగా ఆమెకు రంగస్థలం మీదే నొప్పులు ప్రారంభమైతే నాటకానికి విరామం ప్రకటించి తెరలు దించేసారు. అక్కడ ఆ రంగస్థలం మీదే ఆమెకు కమలాబాయి జన్మించింది. చివరిదాకా నటనే ఊపిరిగా బ్రతికింది.

Vol. No. 02 Pub. No. 144a

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం