Tuesday, August 24, 2010

మూగ ప్రజా ప్రతినిధి


 ఈ పేరు గత తరం పాఠకులకు చిరపరిచితం. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ప్రారంభించిన ఆంధ్రపత్రిక ఆ రోజుల్లో అఖిలాంద్ర ప్రజల ఆదరాభిమానాల్ని అమితంగా చూరగొంది.

ఆ పత్రికను స్వయంగా నడుపుతూ సంపాదక బాధ్యతలను కూడా చిరకాలం నిర్వహించిన శివలెంక శంభుప్రసాద్ గారు కొంతకాలం పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేసారు. అయితే పార్లమెంట్ లో అనవసర చర్చల్లోను, వాదోపవాదాలలోను పాల్గోవడం ఆయనకు నచ్చని విషయం. అందుకే సాధారణంగా సమావేశాల్లో ఆయన నోరు మెదిపేవారు కాదు.

ఒకసారి ఒకాయన శంభుప్రసాద్ గార్ని " ప్రసాద్ గారూ ! మీరు పార్లమెంట్ లో ఎప్పుడూ మాట్లాడరేమిటి ? " అనడిగాడట.

దానికి సమాధానంగా " అశేష మూగ ప్రజానీకానికి నేను ప్రతినిధిని కదా ! నేనేం మాట్లాడగలను ? " అని చమత్కరించారట శంభుప్రసాద్ గారు.

Vol. No. 02 Pub. No. 011

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం