
మునిమాణిక్యం నరసింహారావు గారి పేరు తెలియని సాహితీ ప్రియులుండరేమో ! గిలిగింతలు పెట్టే ' కాంతం కథలు ' ఒక్కటి చాలు ఆయన్ని హాస్య రచయితగా తెలుగువారి మదిలో నిలపడానికి.
ఆయన మచిలీపట్టణం లోని హిందూ హైస్కూల్లో పనిచేశారు. అప్పట్లో ఆయనకో వింత అలవాటుండేది. తరచూ గోళ్ళు కొరుక్కునేవారు. పాఠం చెప్పే సమయంలో కూడా ఆ అలవాటు కొనసాగేది.
ఓసారి ఆయన ' ఆర్యులు - నాగరికత ' పాఠం చెబుతున్నారు. ఆయన పాఠంతో బాటు గోళ్ళు కొరకడం కూడా సాగుతోంది. మధ్య మధ్యలో విద్యార్థుల్ని ప్రశ్నలడుగుతున్నారు.
" ఆర్యుల ముఖ్య ఆహారం ఏమిటి ? " అని ఒక విద్యార్థిని లేపి అడిగారు.
" గోధుమలు, సజ్జలు, వరి ....... " అని నసుగుతున్నాడు ఆ విద్యార్థి. మునిమాణిక్యం గారు తన పని కానిస్తూనే ఆ విద్యార్థితో
" ఇంకా... " అన్నారు.
" రాగులు, జొన్నలు....." అని ఆగాడు, మేస్టారు ఇంకా ఏం చెప్పారా అని ఆలోచిస్తూ. మాస్టారు అతన్ని మరింత ఉత్సాహపరచాలని
" ఇంకా.... ఇంకా ....." అంటూనే వున్నారు గోళ్ళు కొరుక్కునే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే.
ఇంకా ఏమున్నాయా అని తీవ్రంగా ఆలోచిస్తున్న ఆ విద్యార్థి పరధ్యానంగా
" గోళ్ళు " అన్నాడు.
.................. అంతే ! మాస్టారితో బాటు పిల్లలంతా ఒకటే నవ్వులు.
Vol. No. 01 Pub. No. 365
2 comments:
:-)
* భావన గారూ !
* సంతోష్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment