
1953 లో వచ్చిన దేవదాసు చిత్రానికి సంగీత దర్శకుడు సి. ఆర్. సుబ్బురామన్ అని సినిమా సంగీత ప్రియులందరూ టక్కున చెప్పేస్తారు. అయితే ఇప్పటికీ సజీవంగా నిలిచిపోయిన జగమే మాయ పాట స్వరకర్త మాత్రం సుబ్బురామన్ కాదంటే నమ్మరేమో ! కానీ ఇది నిజం.
ఆ చిత్ర నిర్మాణ సమయంలో సుబ్బురామన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయన ఈ పాటను స్వరపరిచే పరిస్థితి లేదు. ఆ సమయంలో ఆయనకు సహాయకుడిగా ఉన్న ఎం.ఎస్. విశ్వనాథన్ ఈ బాధ్యతను తీసుకున్నారు. తర్వాత రోజుల్లో దక్షిణాదిన అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా ఆయన ఎదగడం, ఎన్నెన్నో అపురూపమైన పాటల్ని అందించడం మనందరికీ తెలిసిన విషయమే !
2 comments:
ఔనండి
ఇది విన్నాను. మంచి పాటం గుర్తు చేసారు.
శ్రీనిక గారూ !
ధన్యవాదాలు
Post a Comment