Sunday, June 6, 2010

విరాళం పెంచిన వ్యాపారం

బెనారస్ హిందూ యూనివర్సిటీ ( కాశీ విశ్వ విద్యాలయం ) స్థాపకుడు పండిట్ మదనమోహన్ మాలవ్యా. ఆ విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన అవిరళ కృషి చేశారు. అందులో భాగంగా విరాళాల సేకరణ కూడా ఆయనే స్వయంగా చేసేవారు. ఆ పని మీద ఒకసారి ఆయన ఒక బ్యాంకు అధిపతి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ఆ బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో వుంది. అందువల్ల విరాళమియ్యలేని తన అశక్తతను మాలవ్యా దగ్గర వ్యక్త పరచాడు ఆ బ్యాంకు అధిపతి.

మదనమోహన్ మాలవ్యా కొద్దిసేపు ఆలోచించారు. ఆయనకో ఉపాయం తట్టింది. " ఒక పని చేద్దాం ! మొదట అయిదు లక్షల రూపాయలకు ఒక చెక్కు రాసివ్వండి. దాంతో మీ వ్యాపారం కూడా బాగుపడుతుంది " అన్నారు.

ఆ బ్యాంకు అధిపతికి ఏమీ అర్థం కాలేదు. అసలే నా వ్యాపారం బాగులేదంటే ఈయన అయిదు లక్షలకు చెక్కు ఇమ్మంటారేమిటీ ? అనుకున్నాడు. అదే విషయం మాలవ్యా గారికి చెప్పాడు. ఆయన వెంటనే " అదేం కాదు. ముందు నేను చెప్పినట్లు చెయ్యండి. తర్వాత విషయం నేను చూసుకుంటాను "

మాలవ్యా గారి మీద గురి, గౌరవం వున్న ఆ బ్యాంకు అధిపతి ఇంకేమీ మాట్లాడకుండా అయిదులక్షలకు చెక్కు రాసి ఇచ్చాడు. అంతే ! మర్నాడు వార్తాపత్రికల్లో ఫలానా బ్యాంకు కాశీ విశ్వవిద్యాలయానికి అయిదు లక్షల విరాళం ఇచ్చినట్లు వచ్చింది. దాంతో ప్రజల్లో అప్పటివరకూ ఆ బ్యాంకు మీద వున్న అపోహలు, సందేహాలు అన్నీ తొలగిపోయి మళ్ళీ డిపాజిట్లు ఇవ్వడం ప్రారంభించారు. అలా బ్యాంకు ఆర్ధిక పరిస్థితి గాడిన పడింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి విరాళం దక్కింది.


Vol. No. 01 Pub. No.311

7 comments:

మధురవాణి said...

Wow.. very interesting!

కంది శంకరయ్య said...

అందుకే అందరూ మదన్ మోహన్ మాలవ్యా (యం.యం.యం) ను మనీ మేకింగ్ మిషన్ అన్నారు.

SRRao said...

* మధురవాణి గారూ !
* శంకరయ్య గారూ !

ధన్యవాదాలు

Vinay Datta said...

very interesting. he had strong determination to serve the country. at the same time he extended his generosity to helping others live happily by helping them overcome their problem.

Kandi garu, yours is a timely input.

SRRao said...

మాధురి గారూ !
ధన్యవాదాలు

రవిచంద్ర said...

మంచి ఐడియా

SRRao said...

రవిచంద్ర గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం