
ఓసారి ఆ పత్రికలో ఆప్పుడే వెలుగులోకి వస్తున్న ఒక కవిగారిని ఘాటుగా విమర్శిస్తూ ఒక వ్యాసం ప్రచురించారు. అంత ! ఆ కవిగారికి కోపం వచ్చింది. జ్వాల కార్యాలయానికి ఆవేశంగా వచ్చి ముద్దుకృష్ణ గారిని కలిసారు. ఆగ్రహం వ్యక్తం చేసారు. తన నిరసన తెలిపారు.
ముద్దుకృష్ణగారు ముద్దుగా నవ్వుతూ " అయ్యా ! మేమేదో ప్రచురించాం ! కానీ మా పత్రిక కొని చదివే వాళ్ళలో సగంమంది ఆ వ్యాసాన్ని చూడరు. చూసిన వాళ్ళలో సగంమంది చదవరు. చదివిన వాళ్ళలో సగంమందికి అందులోని విషయం అర్థం కాదు. అర్థమయిన వాళ్ళలో సగంమందికి తమరెవరో తెలియదు. మిమ్మల్ని తెలిసిన వాళ్ళలో సగంమంది ఎలాగూ ఆ వ్యాసాన్ని నమ్మరు. ఎవరైనా నమ్మితే.... ఆ నమ్మిన వారిలో సగంమందిని మనం లెఖ్ఖ చెయ్యనక్కర్లేదు. ఇక మిగిలేది ఈ చివరి సగంమంది. వాళ్ళవలన తమకేమీ నష్టం లేదు కనుక మీరేం ఖంగారు పడనక్కరలేదు, నిశ్చింతగా ఉండండి " అని ఓదార్చి పంపేశారట.
Vol. No. 01 Pub. No. 195
3 comments:
మీరు ఛలోక్తులు చక్కగా సేకరించి మా అందరికి అంద చేస్తున్నారు. ధన్యవాదాలు.
good one
* శివ గారూ !
కృతజ్ఞతలు
* అప్పారావు శాస్త్రి గారూ !
ధన్యవాదాలు
Post a Comment