Friday, March 2, 2012

భారత కోకిల స్మృతి

స్వంత గడ్డ కాకపోయినా పుట్టింది , పెరిగింది, ప్రపంచ యవనిక మీద భారత కోకిలగా ప్రసిద్ధి చెందడానికి పునాది పడింది తెలుగు నేల మీదనే !
ఆ కోకిలే తెలుగు వారి దత్త పుత్రిక, తెలుగు వారి కోడలు సరోజినీ నాయుడు.
హైదరాబాద్ నగరంతో అనుబంధాన్ని, ప్రేమబంధాన్ని ముడివేసుకున్న సరోజిని భారతీయులు గర్వంగా చెప్పుకోగలిగిన విదుషీమణి, స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి
హైదరాబాద్ నగరానికి తలమానికంగా చెప్పుకునే నిజాం కళాశాల వ్యవస్థాపకుల్లో ప్రముఖులు సరోజిని తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ. ఆమె తల్లి  సుందరి దేవి కూడా బెంగాలీలో కవయిత్రే !
సరోజినీ చిన్ననాటనే పెర్షియన్ భాషలో రచించిన కవిత నైజాం నవాబును మెప్పించింది.  పదహారవ ఏటనే ఆమెను పై చదువులకోసం లండన్ పంపించింది.  అక్కడ ప్రముఖ సాహితీకారుల సాంగత్యం ఆవిడ సృజనాత్మకతకు మరింత పదును పెట్టింది.
పందొమ్మిదవ ఏటనే అప్పటి సాంప్రదాయాలను ఎదిరించి కులాంతర ప్రేమ వివాహం చేసుకుని తెలుగు వారి కోడలయింది.
గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ టాగోర్, జిన్నా, గాంధీ, నెహ్రు లాంటి నాయకుల ప్రభావంతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొని భారత స్త్రీలకు స్పూర్తి నిచ్చింది.
అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా  కూడా ఎంపికయింది.
స్వాతంత్ర్యానంతరం  ఉత్తరప్రదేశ్ కు గవర్నర్ గా పని చేసి తొలి భారతీయ మహిళా గవర్నర్ అయింది.
ఆ సమయంలోనే ప్రపంచాన్ని తన కవితాగానంతో ఉర్రూతలూగించినఈ భారత కోకిల  1949  మార్చి   2  వ తేదీన  నింగికెగిసింది.
  భారత కోకిల సరోజినీ నాయుడుకి స్మృత్యంజలి ఘటిస్తూ............

భారత కోకిల సరోజినినాయుడు కవితల్ని ఈ లింక్ లో చదవండి.

http://www.poemhunter.com/sarojini-naidu/poems/

 భారత కోకిల జీవిత చిత్రణ ఈ ఫిల్మ్స్ డివిజన్ డాక్యుమెంటరీ లో ..............



Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 123

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం