Friday, December 23, 2011

అష్టవిధ నాయిక అజయ్

కూచిపూడి నృత్య సంప్రదాయంలో పురుషులు స్త్రీ వేషం ధరించి నర్తించడం జరుగుతుంటుంది. ఇంతకూ ముందు తరంలో ఆ ప్రక్రియకు శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు జీవం పోశారు. ఇప్పుడు ఈ తరంలో ఆయనకు వారసుడిగా ఎదగడానికి కృషి చేస్తున్నారు సింగారమణి సి. హెచ్. అజయ్ కుమార్ గారు.

విజయవాడలో జరుగుతున్న వెంపటి నృత్యోత్సవ్ - 2011  లో మొదటిరోజైన 22  వ తేదీ గురువారం శ్రీ అజయ్ కుమార్ గారు స్త్రీ వేషం ధరించి అష్టవిధ నాయికలను రంగస్థలం మీద ఆవిష్కరించారు. అంగికాభినయాలను అద్భుతంగా పలికించిన ఈ అంశంతో బాటు ఆ రోజు ప్రదర్శనలో అమెరికాలో ఉంటున్న శ్రీమతి పుష్యమి ప్రదర్శించిన అంశాలు, నాట్యాచార్య హేమంత్ దంపతుల ఆధ్వర్యంలో సాగిన కథక్, మణిపురి, కథకళి, మోహినియాట్టం రీతుల్లో ప్రదర్శించిన అంశాలు, ముఖ్యంగా వివిధ నాట్య సంప్రదాయాల కదంబంగా కూర్చిన దశావతారాల అంశం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

మొదటి రోజు కార్యక్రమాలను హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఆనాటి కార్యక్రమాల చిత్ర కదంబం .............  





Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 093

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం