తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైన కూచిపూడి నృత్యాన్ని ప్రపంచమంతా వ్యాపింపజెయ్యడానికి కృషి చేసిన మహనీయుల్లో పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారు ఒకరు. తెలుగు వారి సంస్కృతీ వైభవానికి ప్రతీకగా నిలిచిన కూచిపూడి సాంప్రదాయాన్ని పరంపరగా అందిపుచ్చుకున్న చినసత్యం గారు అదే పరంపర కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశారు..... చేస్తున్నారు.
కూచిపూడి నాట్యానికి చినసత్యం గారు చేస్తున్న సేవకు కృతజ్ఞతగా హంసధ్వని కూచిపూడి నృత్యాలయ వ్యవస్థాపకులు ' సింగారమణి ' సిహెచ్. అజయకుమార్ గారు, సి హెచ్. శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల ఈ నెల 22, 23, 24 తేదీలలో వెంపటి నృత్యోత్సవ్ 2011 పేరిట అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఆ విశేషాలను వివరిస్తున్నారు శ్రీ అజయ్ కుమార్ గారు.......
ఈ మూడురోజుల ఉత్సవానికి విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలలోని మిత్రులందరూ హాజరయి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన.
కార్యక్రమ ఆహ్వాన పత్రిక ఈ క్రింది లింక్ లో ............
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 092

No comments:
Post a Comment