Tuesday, March 3, 2020

' మధు ' శతమ్... కావ్యావతరణం...ప్రేమలేఖల్లో వినోద, విషాద రేఖలు... ఇంకా

* ఆంధ్ర పురాణమును మొదలుపెట్టి ఉదయ, శాతవాహన, చాళుక్య, కాకతీయ, పునః ప్రతిష్ట విద్యానగర శ్రీకృష్ణదేవరాయ విజయనాయక రాజ నామకరణాలతో తొమ్మిది అంశాలుగా విరగడించి సంప్రదాయబద్ధమైన 2052 గద్య పద్యాలను తొమ్మిది పర్వాలుగా గుది గుచ్చి తెలుగు సాహిత్య సరస్వతికి అపూర్వాభరణంగా సమర్పించారు మధునాపంతులవారు. మధురకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారి శతజయంతి ( మార్చి 5 ) సందర్భంగా ప్రత్యేక వ్యాసం.... ' మధు ' శతమ్
* ఆస్తికశ్చిత్‌వాగ్విశేషః ’. కేవలం ఈనాటి వార్తలేమిటి అనే అర్థం వచ్చినా, విద్యాధరి లాంటి పండితురాలు ఏదో విశేషార్థంతో మాట్లాడి ఉండాలని కవి అభిప్రాయం. తరచితరచి ఆలోచించగా దానిలో ( అస్తి ) భూత ( కశ్చిత్ ) భవిష్యత్ ( వాక్ ) వర్తమాన కాలాలు స్పురించాయి. ఆమె నాకేమిటి చెప్తోంది ? త్రికాలాల గురించా, త్రయీవిద్యగూర్చా, త్రిదేహ త్రిగుణాలగురించా ? మనస్సంతా విద్యాధరి, ఆమె పలుకులు ఆక్రమించాయి..... కావ్యావతరణం 

 * దమయంతి ప్రేమ సమాచారం మోసుకు వెళ్లడానికో హంసను వెతుక్కొంది. అది చాలా తెలివైన హంసగనుక, ప్రణయజీవితాలు అర్థం చేసుకొన్న పక్షిగనుక ఆ మాత్రం సహాయం చేసింది. రుక్మిణీదేవి ఒక బ్రాహ్మణ్ణి వెతుక్కొంది – తనగోడు గోపాలకృష్ణుడికి చెప్పి పంపడానికి ! ఆయన గారికి ఏవో లంచాలు ఇచ్చింది. ప్రేమలేఖ వ్రాయలేక – విరహం అంతా ఆయన ముందు వెళ్ళగ్రక్కింది. అతగాడు ఆ రోజుల్లో టేప్ రికార్డర్ వంటివాడు. వెళ్ళి అక్కడ అంతా ప్లే చేసి వినిపించాడు..... రావూరు కలం - ప్రేమలేఖల్లో వినోద, విషాద రేఖలు

ఇంకా... కొన్ని.... ఈ క్రింది లింక్ లో..... 
శిరాకదంబం 09_011


 Visit web magazine at https://sirakadambam.com/ 

Vol. No. 11 Pub. No. 011

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం