Monday, June 17, 2013

శ్రీపాద వారి ' క్రొత్తచూపు '

  తెలుగు కథా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. 

21 వ శతాబ్దం తొలి రోజులంటే ఛాందస వాదం రాజ్యమేలుతున్న కాలం. ముఖ్యంగా స్త్రీలు సంప్రదాయ బంధనాల్లో మగ్గుతున్న రోజులవి. స్త్రీ అభ్యుదయం అనే మాట ఎత్తడానికే జంకే కాలమది. ఆ రోజుల్లో ఆడవారు చదువుకోవడమే ఒక నేరం. అసలు గడప దాటి బయిటకు వెళ్ళడమే అపరాధం. అలాంటిది ఒక స్త్రీ మగవారికే స్వంతమనుకునే సాముగరిడీలు కూడా నేర్చుకుంటే....... కుస్తీలు పడితే .... ఊహించడానికి కూడా వీలు లేదు అప్పుడు. అప్పుడేమిటి ? ఇప్పుడు కూడా స్త్రీలలో ఎంత శాతం సాము గరిడీలు, కుస్తీలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ? ఇష్టపడినా ఎంతవరకూ సాధ్యమవుతోంది ? ఆరు, ఏడు దశాబ్దాల క్రితమే అది సాధ్యమని నిరూపించారు శ్రీపాద వారు తమ కథ‘ క్రొత్త చూపు ’ లో .......
స్త్రీ అభ్యుదయం అంటే ఏమిటో తెలిపే ఈ కథా పరిచయం ‘ శబ్దకదంబం ‘ శీర్షికలో...  శ్రీమతి ఎర్రమిల్లి శారద స్వరంలో... 
శిరాకదంబం 02_032 సంచిక 32 వ పేజీలో వినండి.    

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 04 Pub. No. 082

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం