Friday, July 27, 2012

వరలక్ష్మీ వ్రత పుణ్యకథ..... రావిశాస్త్రి జ్ఞాపకాలు......

 శ్రావణమాసం..... వరలక్ష్మీ వ్రతం శుభకరం.... శుభాకాంక్షలతో...... వరలక్ష్మీ వ్రత పుణ్య కథ....

జూలై 30  తెలుగు సాహితీ ప్రపంచంలో.... ఒక విలక్షణమైన శైలితో సంచలనం సృష్టించిన రచయిత రావి శాస్త్రి గారి జయంతి... ఆ సందర్భంగా ఆయన జ్ఞాపకాలతో కూడిన వ్యాసం......

కవయిత్రి కొండేపూడి నిర్మల గారి రెండు కవితా సంపుటాలు ఆవిష్కరణ ఈ నెల 28 శనివారం సాయింత్రం.....

ఇంకా.........



Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 03 Pub. No. 152

Sunday, July 22, 2012

ఈ భువిలో విరిసిన పారిజాతం....

ఏ దివిలో విరిసిన పారిజాతమో......
 కాదు.... ఈ భువిలోనే విరిసిన తెలుగు కవితా పారిజాతం దాశరథి.
మృదుమధురమైన భాషా పరిమళాలను మనకందించిన కవితానిధి.
తన కలంతో తరతరాల నిజాం పాలకుల బూజు దులిపిన సాహితీ పెన్నిధి. 
తెలుగు సాహితీ రంగంలో చెదిరిపోని, చెరిగిపోని ముద్ర మధురకవి దాశరథి.


మధుర కవి దాశరథి జయంతి సందర్భంగా ఆయనకు నీరాజనాలు అర్పిస్తూ.....,,

దాశరథి గారి గురించి గతంలో రాసిన టపాలు.... ఆయన పాటల కదంబం..... ఈ క్రింది లింకుల్లో..... 

* కోటి రతనాల పాట ' దాశరధి '
* దాశరధీ... కవితా పయోనిధీ !

 మధుర కవి, మహా కవి దాశరథి గారి జయంతి సందర్భంగా ' దాశరథి మామయ్య ' పేరుతో ఆయన మేనకోడలు, రచయిత్రి, జర్నలిస్ట్ శ్రీమతి దుర్గ డింగరి రాసిన వ్యాసం ఈ వారం ప్రత్యేకం శిరాకదంబం పత్రిక జ్ఞాపకాల కదంబం లో తప్పక చదవండి.
 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 151

Friday, July 20, 2012

దాశరథి మామయ్య.... భారతీయ సంగీతంలో పాశ్చాత్య సంగీత పరికరం....ఇంకా....

మధుర కవి, మహా కవి దాశరథి గారి జయంతి ఈ నెల 22 వ తేదీ. ఆ సందర్భంగా ' దాశరథి మామయ్య ' పేరుతో ఆయన మేనకోడలు, రచయిత్రి, జర్నలిస్ట్ శ్రీమతి దుర్గ డింగరి రాసిన వ్యాసం ఈ వారం ప్రత్యేకం జ్ఞాపకాల కదంబం లో...

పాశ్చాత్య సంగీత పరికరమైన వైలెన్ భారతీయ సంగీతంలో ఒదిగిన వైనం.... హిందూస్థానీ సంగీత బాణీలో ....... కర్ణాటక సంగీత బాణీలో ఇద్దరు మహా విద్వాంసుల నుండి.....  సాంస్కృతికం లో........

లఘు చిత్రాలు ( Short Films ) కు ఆహ్వానం, బాల కదంబం మొదలైన వాటి గురించి నూతన శీర్షికలు లో....


ఇంకా అనేక భావ వీచికలు మీ ముంగిట్లో ..............




Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 150

Thursday, July 12, 2012

భవరోగాలు...గాంధీని చూసినవాడు.....

 కాదేదీ ప్రచారానికి అనర్హం. గాంధీ గారిని కలిసామని, ముట్టుకున్నామని, ఆయన వస్తువులు తమ దగ్గరున్నాయని చెప్పుకుని ప్రచారంలోకి రావాలనుకునే తరం కొంతకాలం క్రితం ఉండేది. ఈ రకంగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవచ్చని వారి భావన. అయితే అలాంటి వాళ్ళు ప్రచారార్భాటమే గానీ గాంధీజీ భోదల్నీ, ఆశయాల్ని, చివరకు ఆయన శిలావిగ్రహాలను ఎంతవరకూ పట్టించుకుంటారు అన్నదే ప్రముఖ కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి " గాంధీని చూసినవాడు " కథాపరిచయం...

భౌతిక రోగాలు కాకుండా ' భవరోగాలు ' ఏమిటి ? వాటి చికిత్స ఏమిటి ?  వైద్యుడు ఎవరు ? తెలుసుకోండి.... 

యువత కోసం, పిల్లలకోసం ప్రవేశ పెడుతున్న నూతన శీర్షికలు లలో పాల్గొనండి. 

ఇంకా .......



Visit web magazine at www.sirakadambam.com 

 Vol. No. 03 Pub. No. 149

Friday, July 6, 2012

దక్షిణాయనం..... గురుపూర్ణిమ......

 దక్షిణాయనం ప్రవేశిస్తోంది. కర్కాటక సంక్రమణ కాలం.
గురుపూర్ణిమను వ్యాస పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు ?
వ్యాసుని జన్మ వృత్తాంతము, ఆయన గొప్పతనము గురించి ....... వివరణ మొదటి భాగం........
ఇంకా ...............





శిరాకదంబం పత్రికలో త్వరలో ప్రారంభించబోయే కొత్త శీర్షికలకోసం నూతన శీర్షికలు చూడండి. ఆ శీర్షికలలో పాల్గొనండి.
 
Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 148

Sunday, July 1, 2012

తెలుగు చిత్ర వ్యాకరణ పండితుడు


ఒక కథ రాయాలన్నా, చెప్పాలన్నా భాష అవసరం. 
 పదాలు పొందిగ్గా, ఒక పద్ధతిలో, ఎదుటివారికి సులువుగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఆ భాషకు వ్యాకరణం తోడు చాలా అవసరం.
 ప్రతీ భాషకు తనదైన వ్యాకరణం ఉంటుంది.
అమ్మమ్మ చెప్పే కథ దగ్గర్నుంచి నేటి చలన చిత్ర కథల వరకూ మంచి కథ ఎంత అవసరమో..... దాన్ని ఆసక్తికరంగా, అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో చెప్పే పద్దతి కూడా అంతే అవసరం.


ఈ అవసరాన్ని గుర్తించిన ఏకైక తెలుగు చలన చిత్ర నిర్దేశకుడు కదిరి వెంకట రెడ్డి గారు.

 " మనం సినిమా తీసేది వేలిముద్ర గాళ్ళ కోసం, పామరుల కోసం. వాళ్లకి అర్థమయితే పండితులకూ అర్థమవుతుంది. దట్స్ ద వే స్క్రీన్ ప్లే కమ్స్. దారాన్ని లాగితే తెగిపోకుండా చివరిదాకా ఒక సూత్రం లాగా రావాలి కథ ! " అన్నారు కె. వి. రెడ్డి.
ఈ సూత్రం ఆయన వంట పట్టించుకున్నారు గనుకే ఆయన స్క్రీన్ ప్లే లు, వాటి వలన ఆయన చిత్రాలు అజరామరాలు.

 " వినేవాడిని కూర్చోబెట్టి వాడికి తెలిసిందే చెప్పుకుంటూ పొతే ' మాకు తెలుసులేవయ్యా ! మహా బోర్ కొడుతున్నావు ' అంటాడు. తెలియని విషయాలు ముక్కు సూటిగా చెప్పుకుంటూ పొతే ' ఏమిటయ్యా ? నీ సొద ఇందాకట్నుంచీ ఒకటే గోల ' అని విసుక్కుంటారు. అందుకని ఏం చెప్పినా వినే వారికి వీనుల విందుగా చెప్పాలి. అందీ అందని విషయాలు సున్నితంగా చెప్పాలి "
ఇదీ ఆయన థియరీ !

తెలిసిన కథలనే వీనుల విందుగా, సున్నితంగా, నేత్ర పర్వంగా చెప్పారు గనుకే ఆయన చిత్రాలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. భవిష్యత్తులో తగ్గదు కూడా ! 
ఆయన కథకుడే కాదు.... గాయకుడు..... చిత్రలేఖకుడు కూడా !
అందుకే ఆయన కథలెంత ఉన్నతంగా ఉంటాయో, ఆయన చిత్రాల్లోని పాటలంత మధురంగానూ, అయన చిత్రాల్లోని సెట్స్ అంత కన్నుల పండువగానూ ఉంటాయి.
ఖచ్చితంగా తనకేం కావాలో చెప్పి చేయించుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కానీ రెడ్డి గారికది నల్లేరు మీద నడక.

కదిరి నరసింహస్వామి ఆలయం మెట్లు రోజూ కడిగి, ముగ్గులు పెట్టి ఆయన మాతృమూర్తి సంపాదించిన పుణ్యఫలం కె.వి.రెడ్డి గారికి అందింది. ఏమాత్రం స్వార్థ చింతన లేకుండా తరతరాలకు సరిపడే ఆ పుణ్యఫలాన్ని తన భక్తిరస చిత్రాల ద్వారా తెలుగు జాతికి అందించారు రెడ్డి గారు.  దానికి నిదర్శనమే ఆయన తొలి చిత్రం ' భక్త పోతన ' లోని భక్తి పారవశ్యం తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం గ్రామంలో ఒక అతి సామాన్య బాలుని ' బాలయోగి' గా మార్చేసింది.

కె. వి. రెడ్డి గారు మూడు కాలాలకు చెందిన వ్యక్తి.  భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు ఆయనవే !

తెలుగు చలన చిత్రాలకు ఒక ప్రమాణాన్ని నిర్దేశించిన దార్శనికుడు, 
శ్రద్ధ, ఓర్పు, పట్టుదల, క్రమశిక్షణ లకు మారు పేరు,
 చలన చిత్రాలకు ఒక శాస్త్రాన్ని రచించి కళా స్వరూపాలు అని నిరూపించిన చలన చిత్ర శాస్త్రజ్ఞుడు,
తెలుగు చలన చిత్రాలకు మార్గదర్శి

కె. వి. రెడ్డి గారి శతజయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ.....
 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 147
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం