Sunday, January 22, 2012

కంద పద్య పాదాలు

 మనసుకవి ఆత్రేయ గారు పాటలు, మాటలే కాదు. పద్యాలూ కూడా బాగా వ్రాసేవారు. 
నిజానికి ఆయనకు పద్యమంటే చాలా ఇష్టం. అందులోనూ కంద పద్యమంటే మరీ ఇష్టం. 
అయన మాటల్లో చమత్కారం అడుగడుగునా తొంగి చూసేది. 

 ఓసారి ఆయన మిత్రులతో బాతాఖానీలో మునిగి వున్నారు. అదే సమయంలో రోడ్డు మీద ఓ జంట నడుచుకుంటూ వెడుతున్నారు. ఆ జంటలో భర్త బాగా పొడుగ్గా, భార్య పొట్టిగా వున్నారు. 


ఆ వింత కాంబినేషన్ ని చూసిన ఓ మిత్రుడు ఆత్రేయ గారితో 
 ' విచిత్రంగా వున్నారు కదూ ! వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తోంది ? ' అని అడిగాడు. 

వెంటనే ఆత్రేయ తడుముకోకుండా 
' వాళ్ళకేం ! బ్రహ్మాండంగా వున్నారు...... కంద పద్య పాదాల్లా ! ' అన్నారట.  


Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 106

0 వ్యాఖ్యలు:

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం