Wednesday, August 31, 2011

సాహితీ కృషీవలుడు

గరుత్మంతుళ్లు తెచ్చిన అమృతం 
దక్కిందనుకోవడం అనృతం !

దర్భలు నాకేరు మన ఏలికలు 
అందుకే ఈ నాలికల చీలికలు !

కరి మింగింది వెలగపండు 
కాదు కాదంటే పోనిండు !

మన స్వతంత్ర్యం మేడిపండు 
మన దారిద్ర్యం రాచపుండు !

1949 లో ' ఆనందవాణి ' పత్రికలో ' ఆగష్టు పదిహేను ' పేరుతో ఆరుద్ర రాసిన కవిత అది. ఇందులో అప్పటి పరిస్థితులపై నిప్పులు చెరిగిన ఆరుద్రలో భవిష్యత్తు దృష్టి కూడా వుండి వుండాలి.

1927 ఆగష్టు 31 న భాగవతుల వారింట పుట్టిన సదాశివశంకర శాస్త్రి 1942 నుంచీ ఆరుద్ర గా మారిపోయారు. అప్పటినుంచి అందరూ అసలు పేరు మర్చిపోయారు.

 ఆరుద్రగా మారాక ఆయన స్పృశించని రంగం లేదు.
కవితాఖండికలు రాసారు... వ్యాసాలు రాసారు....
పాటలు రాసారు.... పదాలు అల్లారు.....
పరిశోధనలు చేసారు..... చదరంగం ఆడారు...
నాట్యశాస్త్రాన్ని ఔపోసన పట్టారు..... మేజిక్ నేర్చుకున్నారు
.... ఇలా ఆయన చాలా చేసారు. ఏది చేసినా అన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించారు.

అంతేకాదు.... 
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు....
స్వాతంత్ర్యోద్యమంలోను పాల్గొన్నారు......
ప్రాచీన సాహిత్యం అధ్యయనం చేసారు.....
ఆధునిక సాహిత్యాన్ని దోసిట పట్టారు....

అనంతమైన సాహితీ సాగరాన్ని మథించారు
సమగ్రాంధ్ర సాహిత్యామృతాన్ని వెలికి తీసారు
ఆ అమృతాన్ని తెలుగువారందరికీ పంచారు  
భావితరాలకు అరుదైన కానుకను అందించారు

తెలుగు భాషామతల్లికి ఎనలేని సేవ చేసిన ఆరుద్రగారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.... 


 ఆరుద్ర గారిపై గతంలో రాసిన టపా, ఆయన పాటల కదంబం ఈ క్రింది లింకులో .....

అక్షర చదరంగ నిపుణుడు

Vol. No. 03 Pub. No. 020

6 comments:

Padmavathi Kotamraju said...

ramachandra rao garu, thanks for sharing it. really, they were visionaries with realistic outlook.

Gomati Ravi said...

Correct mastaru. Vare manaki adarsahm.

Rv Ramana Rao said...

Aarudra gari gurinch meeru samagrangaa theliyajesina vishayaalu entho aasaktikarangaa unnaayi. Meeku naa dhanyavaadamulu Rao garu.

SRRao said...

* పద్మావతి గారూ !
* గోమతి గారూ !
* రమణారావు గారూ !

ధన్యవాదాలు

Anantha Ram Addanki said...

dhanyavaadaalu rao gaaru

SRRao said...

అనంతరామయ్య గారూ !
మీక్కూడా ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం