Tuesday, June 28, 2011

ఇద్దరు సాహితీమూర్తులు

 తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన భిన్నమైన దృక్పధాలు గలిగిన ఇద్దరు సాహితీమూర్తుల జన్మదినం ఈరోజు. 

కొందరు రచయితలు రాసినవి బాగానే వున్నట్లు అనిపించి కొంతకాలం పాటు మనకి గుర్తుంటాయి. తర్వాత మరుపుకు వచ్చేస్తాయి. కొందరు రాసిన రాతలు బాగా వుండి మన హృదయాలకు హత్తుకుని ఎంతకాలమైనా గుర్తుంటాయి. పాఠకులకి ఆ రచయితలతో అనుబంధం ఏర్పడిపోతుంది. వాళ్ళు అజరామరులు. వారు భౌతికంగా మన మధ్య వున్నా లేకపోయినా మన గుండెల్లో మాత్రం కలకాలం వుండిపోతారు. 

అటువంటి రచయితలలో ముళ్ళపూడి వారు అగ్రగణ్యులు. కొంతమంది కొన్ని వర్గాలకు, కొన్ని సిద్ధాంతాలకు, ఏదో ఒక వయసు వారిని రంజింపజేయడానికి పరిమితమైపోతారు. కానీ అందర్నీ అలరించి ఆకట్టుకోగలిగినవారు చాలా అరుదు. ఆ అరుదైన వారే ముళ్ళపూడి వెంకటరమణ గారు. 




ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా సురేఖ గారి ' రేఖాచిత్రం ' బ్లాగ్ లో ముళ్ళపూడి వారి స్మరణ ఈ లింక్ లో ...............  

RSS
ఈ రోజు మన బుడుగు గారి పుట్టిన రోజు !!

http://surekhacartoons.blogspot.com/2011/06/blog-post_28.html 

 

సాధారణంగా రాజకీయాలకు, సాహిత్యానికి చుక్కెదురు. గతకాలంలో స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్న కొందరు నాయకులు సాహిత్యంపై ఆసక్తితో కొన్ని రచనలు చేసినా వాటిలో చాలావరకు వారి అనుభవాల మాలికగానో, వారి ఆత్మకథలుగానో ఉండేవి. ఇప్పటి రాజకీయ నాయకుల్లో సాహిత్యాభిలాష వున్నవారు దాదాపుగా కనబడరు. కొందరు పూర్వాశ్రమంలో సాహితీ వ్యవసాయం చేసినా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారికి సమయం దొరకక ఆ వ్యవసాయం ఆగిపోతుంది. 

అయితే సాహిత్యాన్నీ, రాజకీయాలనీ రెండు చేతులతో సవ్యసాచిలా నడిపిన మహనీయుడు మన తొలి తెలుగు ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు. బహుభాషా కోవిదుడు. ఎన్నో గ్రంథాలు రచించారు. పీవీ గారి సాహితీ కృషికి నిలువెత్తు నిదర్శనం విశ్వనాథ సత్యనారాయణ గారి ' వేయి పడగలు ' కు ఆయన చేసిన హిందీ అనువాదం ' సహస్ర ఫణ్ '. 

 ఎందరికోసమో తన మేధస్సునుపయోగించి, ఎన్నో అడ్డంకులు చేదించి ఎవరి ఊహకు అందని పరిస్థితుల్లో ప్రధాని పదవిని చేపట్టారు. ప్రధానిగా కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. పదవీచ్యుతులైన తర్వాత కూడా ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్నారు. అన్నిటినీ మొక్కవోని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న పీవీ మరణానంతరం కూడా అవమానాలకు గురి కావడం శోచనీయం. 

 

ఈరోజు మన తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా నివాళులు.

Vol. No. 02 Pub. No. 267

3 comments:

Vinay Datta said...

ముళ్ళపూడి గారి లాగా హాస్యం పండించాలని, పీవీ గారిలాగా బహుభాషావేత్త అవ్వాలని కోరుకోవడం దురాశే అయినా కోరుకోకుండా ఉండలేకపోతున్నాను.

మాధురి.

Subba Rao Venkata Voleti said...

maa ramachandrarao garu- iddaru saahithee swaroopulaku mee dwaaraa janmadina shubhaakaankshalu. saahithyaaniki maranam ledu- saahithee swaroopulakoo maranam ledu-kadoo?!

SRRao said...

మాధురి గారూ !
మీరు కూడా వారిలా అవ్వాలని కోరుకుంటూ... ధన్యవాదాలు.

సుబ్బారావు గారూ !
మీ అభిమానానికి ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం