Tuesday, June 7, 2011

నటరాజు అస్తమయం

 దివినుండి భువికి దిగివచ్చిన నటరాజు 
అవతారం చాలించి దివికేగాడు  ఈరోజు 

అంతరించిపోయిందనుకున్న ఆంధ్రనాట్యాన్ని పునర్జీవింపజేసారు
అంతులేని వైభవాన్ని తెచ్చిపెట్టి తనపనైపోయిందని వెళ్ళిపోయారు 

నవజనార్థనం అందించి పేరిణీ శివతాండవం చేసారు
ఆంధ్రనాట్య వైభవాన్ని ప్రపంచమంతా చాటారు 

గురుపరంపర కొనసాగించి శిష్య ప్రశిష్యులనెందరినో తయారు చేసారు 
తన కర్తవ్యం నేరవేరిందనే తృప్తితో అనంతదూరం పయనమయ్యారు

........ 1975 లో ప్రధమ ప్రపంచ మహాసభలు హైదరాబాద్ లో జరిగినపుడు తొలిసారిగా నటరాజ రామకృష్ణ గారి బృందం చేసిన ఆంధ్రనాట్యం... అందులో ముఖ్యంగా పేరిణి శివతాండవం చూసినపుడు ఒకరకమైన ఉద్వేగానికి లోనయ్యాను. అప్పుడు కలిగిన అనుభూతి ఇప్పుడు మాటలలో వర్ణించలేను. తర్వాత కొన్ని సందర్భాలలో ఆయన శిష్యులు కళాకృష్ణ మొదలైన వారి ప్రదర్శనలు చూసి ఆనందించినా తొలిసారి చూసిన ఆ ప్రదర్శనను మాత్రం ఇప్పటికీ మరచిపోలేను. ఆయన రాసిన గ్రంథాలలో చాలావాటిని చదవడంతో నాట్యశాస్త్రం మీద అవగాహన ఏర్పడింది. కళను తపస్సుగా భావించి జీవితాన్ని ధారబోసారు నటరాజ రామకృష్ణ గారు. ఆయన శిష్యులుగాను, ప్రశిష్యులుగాను ఆంధ్రనాట్యాన్ని అభ్యసించి తరించిన వారు అదృష్టవంతులు. 

 ఆంధ్రనాట్య నటరాజు... భరత కళాప్రపూర్ణ నటరాజ రామకృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.........


Vol. No. 02 Pub. No. 252

2 comments:

Nrahamthulla said...

ప్రముఖ భారతీయ ఆజన్మ-బ్రహ్మచారులు

డాక్టర్ అబ్దుల్ కలాం (మాజీ రాష్ట్రపతి):
అటల్ బిహారి వాజపేయి (మాజీ ప్రధాని):
స్వామి వివేకానంద
జిడ్డు క్రిష్ణమూర్తి , భారతీయ తత్వవేత్త
అరబిందో
మాయావతి (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి)
ఉమాభారతి (మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి):
పింగళి నాగేంద్రరావు (తెలుగు సినిమా పాటల రచయిత)
కట్టమంచి రామలింగారెడ్డి, బహుముఖ ప్రజ్ఞాశాలి.
రతన్ టాటా లక్షరూపాయల నానో కారు నిర్మాత
మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు
సాధ్వి రితంబర
లతా మంగేష్కర్
నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి
జస్టిస్‌ ధరమ్‌వీర్‌ శర్మ అయోధ్య వివాదంలో తీర్పునిచ్చిన జడ్జి
ఎస్‌.ఆర్‌.శంకరన్‌ ఐ.ఏ.యస్.అధికారి
నటరాజ రామకృష్ణ నాట్యాచార్యుడు

SRRao said...

రహమతుల్లా గారూ !
మంచి సమాచారమిచ్చారు. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం