Sunday, April 3, 2011

చలనచిత్ర కళా తపస్వి


 నిరంతర పరిశ్రమ, దీర్ఘకాల సంఘర్షణలతో ఉన్నత పీఠాన్నధిరోహించిన వారి కోవలోకి చేరిన మరో వ్యక్తి జి. వి. అయ్యర్. 1983 వ సంవత్సరానికి భారతదేశంలో నిర్మించిన ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకున్న “ ఆది శంకరాచార్య “ తో ఆయనకు ఈ గుర్తింపు వచ్చింది. చిత్రా పరిశ్రమకు అంకితమైన అయ్యర్ కీర్తికిరీటంలో ఈ గౌరవం మరో కలికి తురాయి. 67 సంవత్సరాల ( అప్పటికి ) వయసు కలిగిన అయ్యర్ తనకు కలిగిన జాతీయ గుర్తింపులో ప్రత్యేకత ఏమీ లేదని, అర్హత కలదనిపించిన చిత్రానికే ఆ అవార్డును ఇవ్వడం జరిగిందని అన్నారు.

కానీ ప్రాచీన భారత దేశంలో మాత్రమే వాడుకలో వున్నట్లు చెప్పబడుతున్న సంస్కృత భాషలో నిర్మించిన చిత్రం ఏ వర్గం ప్రేక్షకుల కోసం నిర్మించారని అడిగినపుడు ప్రశాంత గంభీర స్వరంతో .................
“ ఆ కాలానికి చెందిన సరైన సమన్వయ భాష ఏది ? నేను శంకరాచార్యుని జీవితచరిత్రను గానీ, దైవాంశశంభూతునిగా అతని మహిమలను గానీ చిత్రీకరించదలచుకోలేదు. 32 సంవత్సరాల శంకరాచార్య జీవితంలో ఆయన ఆలోచనలు, వేదాంతం మాత్రమే నేను దృష్టిలో వుంచుకున్నాను. సృజనాత్మక కళాకారుడు సరైన కాలాన్ని దృష్టిలో వుంచుకుంటాడు. ఆ కాలాన్ని సరిగ్గా విశ్లేషించగలిగితే అది ఆ యుగాన్ని ప్రతిబింబిస్తుంది. పరిసరాలు, వస్త్రధారణ, భాషా ప్రయోగం – ఈ వివరాలన్నీ ఆ కాలానికీ, పరిస్థితులకు సంభంధించినట్లుగా మలచవలసి వుంటుంది. ఆ కాలాన్ని, పరిస్థితులను పరిశీలించినపుడు అన్నీ భాషల ప్రజలకు వారధిగా వున్న భాష ఏది ?
అయిదు వందల ఏళ్ల క్రితం ఇంగ్లీషు లాంటి భాష ఏదీ భారతదేశంలో లేదు. అప్పుడున్నది సంస్కృతం మాత్రమే ! అందువలనే ఆ కాలంనాటి పరిస్థితులను సృష్టించడానికి ఆ భాష మీద ఆధారపడవలసి వచ్చింది. ఆ రకంగా మేము మొట్టమొదటి సంస్కృత భాషా చిత్రాన్ని నిర్మించాం  "

............... ఇంక మిగిలిన వ్యాసాన్ని చిత్రమాలిక లో చదవండి.
 
Vol. No. 02 Pub. No. 189

1 comment:

Unknown said...

aadisankaarula jiivita vishsaalato citra nirmaanam andulonu samskrutamlo sahasame, anduloa vijayamu, manci cedula gurrchi carchinakuudadu. vaari saahasaanii abhinandinchaali mari.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం