Thursday, October 21, 2010

పరామర్శ

సంజీవదేవ్ ప్రముఖ చిత్రకారుడు. ఒకసారి ఆయనింట్లో దొంగలు పడ్డారు. నగలూ, నట్రా పోయాయి. ఈ విషయం ఆయన మిత్రుడైన రచయిత చలం గారికి తెలిసింది. సంజీవదేవ్ గారిని పరామర్శిస్తూ ఆయన ఓ ఉత్తరం రాసారు.

' దొంగలు పడ్డారని తెలిసింది. చారుదత్తుడిలాగ మీరు ఆ దొంగలు వేసిన కన్నం దగ్గర కూర్చుని వారి హస్త లాఘవాన్ని మెచ్చుకోవడం లేదు కదా ! 

  ఏమేం పోయాయి ? నగా నట్రా అయితే ఫర్వాలేదు. కానీ మీ దగ్గరున్న పుస్తకాలు, ఉత్తరాలు, చిత్రాలు భద్రంగా వున్నాయి కదా ! ఎందుకంటే అవి అన్నిటికంటే విలువైనవి కదా !  '

........... ఇలా సాగింది ఆ పరామర్శ.

నిజమే కదా ! నగలూ, నగదూ అయితే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ విజ్ఞాన బాంఢాగారాలైన పుస్తకాలు వగైరా పోతే మళ్ళీ సంపాదించుకోవడం సులువు కాదు కదా ! అయినా వాటికంటే నగలూ, నట్రా విలువైనవి అంటారా ?

Vol. No. 02 Pub. No. 041

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం