Friday, July 2, 2010

గో ' నిధి '

ఆదిభట్ల నారాయణదాసు గారు ప్రఖ్యాతి గాంచిన హరికథకులు. చమత్కారి.  ఆయన అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టేవారు. ఆ క్రమంలో ఒకసారి గోసంరక్షణ నిమిత్తం విరాళాలు సేకరించారు. ఇంతవరకూ బాగానే వుంది.


ఒకసారి ఆయన హరికథ చెబుతుండగా ఒక శ్రోత లేచి 

" అయ్యా ! దాసుగారూ ! మీరు గోసంరక్షణ పేరుతో చాలా డబ్బు వసూలు చేసారు. అదంతా మీరే కైంకర్యం చేసేసారని అభియోగం. దీనికి  మీ సమాధానం ఏమిటి ? " అని అడిగాడు నిలదీసే ధోరణిలో.

దానికి దాసు గారు ఏమాత్రం తొట్రుపాటు లేకుండా చిరునవ్వు నవ్వి
" వెర్రి నాయనా ! నేను కూడా గంగిగోవు లాంటి వాడినే. ముందు నన్ను నేను రక్షించుకోవాలి కదా ! అందుకే ఆ ద్రవ్యంతో నన్ను నేను రక్షించుకున్నాను. మరి నేను గోసంరక్షణ చెయ్యలేదంటావా ? "
అనగానే సభికులందరూ ఘొల్లున నవ్వారట.


Vol. No. 01 Pub. No. 336

2 comments:

Vinay Datta said...

It's not clear whether he really 'knocked' the money or was just joking.

SRRao said...

మాధురి గారూ !

ఆదిభట్ల వారి మాటల్లో చమత్కార శ్లేష తెలుస్తోంది కదండీ !

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం