Monday, May 31, 2010

కవి వృషభం - కామధేనువు

హరికథ పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారు ఆజానుబాహువు. సంగీత, సాహిత్యాలలో దిట్ట. ఆయన తెలుగులోనే కాదు, ఆంగ్లంలో కూడా హరికథ చెప్పి మెప్పించిన ఘనుడు. అసలు హరికథనే కాదు గిరికథ చెప్పమన్నా సిద్ధం. అటువంటి ప్రతిభాశాలితో పరాచికాలాడటమంటే సామాన్యమైన విషయం కాదు. ఆది సామాన్యమైన వ్యక్తి అయినా, మహారాజైనా ఒకటే !

నారాయణదాసుగారు ఒకరోజు తన శిష్యబృందంతో విజయనగరం పుర వీదులగుండా నడిచి వెడుతున్నారు. అదే సమయంలో విజయనగర ప్రభువు ఆనంద గజపతి మహారాజు గారు వ్యాహ్యాళికి బయిలుదేరారు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. మహారాజు కూడా సాహిత్య పిపాసి, సరసుడు.

దాసుగార్ని చూసి ఊరికే వెళ్లిపోలేక ఓ చమత్కార బాణం విసరాలనిపించి " ఎక్కడికి కవి వృషభం ఇలా బయిలుదేరింది ? " అన్నారు రాజావారు.

ఆదిభట్ల వారేమైనా తక్కువ తిన్నారా ? ఆయనతోనా పరాచికాలు ! అందుకే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే అందుకుని " ఇంకెక్కడికి - తమవంటి కామధేనువు వద్దకే.... " అని ప్రతి చమత్కారం విసిరారు.

ఆదిభట్లవారి సమయస్పూర్తికి ఆనందగజపతి హృదయం ఆనందమయమైపోయింది. 

Vol. No. 01 Pub. No. 305

Sunday, May 30, 2010

కనుక్కోండి చూద్దాం !

 కనుక్కోండి చూద్దాం ! - 17

ఈ ప్రక్క ఫోటోలోని వ్యక్తి భారత చిత్రసీమలో పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి.

ఎవరో గుర్తు పట్టగలరా ? 






Vol. No. 01 Pub. No.304

Saturday, May 29, 2010

సమ ' ఆవేశం '


ఒకసారి సాహితీ సమావేశం జరుగుతోంది. కవులు, పండితులు చాలామంది హాజరయ్యారు. మహాకవి శ్రీశ్రీ కూడా హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరయిన ఒక యువకవి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఉడుకునెత్తురు కదా ! రాజకీయాలు, సాహిత్యం .... ఇలా ఒకటేమిటి, అన్నిటినీ..... వాటిలో వున్న కుళ్ళునీ, కుత్సితాల్నీ తన ప్రసంగంలో కడిగి పడేస్తున్నాడు. ఆవేశంతో ఊగిపోతున్నాడు.

శ్రీశ్రీగారు మాటి మాటికీ చేతి గడియారం చూసుకుంటున్నారు. కొంతసేపటికి ఎలా అయితేనేం ఆ యువకవి గారు ఈ లోకంలోకి వచ్చి  శ్రీశ్రీగారి పరిస్థితి గమనించాడు. అంతే... తన ఆవేశానికి బ్రేక్ వేసి కూర్చున్నాడు. వెంటనే శ్రీశ్రీగారు లేచి " ఈ సమావేశం లో మీరు మరీ అంత ఆవేశ పడిపోతే ఎలా కవిగారూ ! " అని  చమత్కరించారు.  ఎంతైనా శ్లేష శ్రీశ్రీ గారి సొత్తు కదా !

Vol. No. 01 Pub. No.303

Friday, May 28, 2010

' వామ ' పక్ష కృష్ణుడు

 ' పల్లెటూరిపిల్ల '  ( 1950 ) చిత్రంలో ఎన్టీరామారావు గారు ఒక ఆస్ట్రేలియన్ ఎద్దుతో పోరాడవలసి వచ్చింది. ఆ సందర్భంలో రెండుసార్లు ఆయన చేతికి గాయాలయ్యాయి.

తర్వాత సంవత్సరంలో ' పాతాళభైరవి ' చిత్రంకోసం మంత్రాల మర్రిచెట్టునుంచి కిందకు దూకాల్సివచ్చింది. ఆ సందర్భంలో కూడా ఆయన చేతికి గాయమైంది. 

1980 లో వచ్చిన ' సర్దార్ పాపారాయుడు ' చిత్రం షూటింగ్లో మోటర్ సైకిల్ పైనుంచి పడినప్పుడు  ఆయన చేతివేళ్ళు చితికిపోయాయి. ఇలా చాలాసార్లు ఆయన చేతికి గాయాలయ్యాయి.

అవన్నీ కూడా ఎన్టీరామారావు గారి కుడిచేతికే !  తగిలిన చేతికే దెబ్బలు పదేపదే తగిలేవి.

ఇన్ని దెబ్బలు తినటం వలన ఆయన కుడిచేయి నరాలు దెబ్బతిని పట్టు కోల్పోయాయి. విరిగిన ప్రతీసారీ ఆయన పుత్తూరు వైద్యులచేతనే కట్లు కట్టించుకునేవారు. ఆ వైద్యులు ఆ చేతిమీద బండరాయితో కొట్టి మరీ కట్టు కట్టేవారట. 

ఇలా కుడిచెయ్యి స్వాధీనం లేకపోవడం వలన ఆయన చివరిరోజుల్లో కృష్ణుడి పాత్ర ధరించిన చిత్రాల్లో అభయహస్తం చూపించేటపుడు ఎడమ చెయ్యి చూపించేవారు. అదికూడా తక్కువ సందర్భాలలో మాత్రమే !

ఒకసారి ఒక పెద్దాయన ఎన్టీఆర్ ని ' వామహస్త అభయం అశాస్త్రీయం కదా ? ' అని అడగ్గా  ' హృదయం ఎడమవైపునే కదా వుంటుంది. అంటే ఎడమ భాగానికి వున్న ప్రాశస్త్యం కుడి భాగానికి లేనట్లే కదా ? ' అని సమాధానమిచ్చారు ' వామ ' పక్ష కృష్ణుడు.

 
Vol. No. 01 Pub. No. 302

తెలుగు తెర కృష్ణుని జన్మదినం

 తెలుగు తెరకు అతడే కృష్ణుడు
తెలుగు ప్రేక్షకులకు అతడే రాముడు 
తెలుగు ప్రేక్షకుల కంటి దీపం ఆనాడు
తెలుగు ప్రజల ఆశాదీపం ఒకనాడు
........ అతడే రాముడు ! 
రాముని మించిన రాముడు 
నందమూరి తారక రాముడు 
......... ఆ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా -




Vol. No. 01 Pub. No. 301

Thursday, May 27, 2010

నెహ్రుగారి దేశభక్తి - ఆహారం




స్వాతంత్ర్యయోద్యమ సమయంలో జవహర్లాల్ నెహ్రు చాలాసార్లు జైలుకెళ్ళడం జరిగింది. ఒకసారి ఆయన వున్న ఒక జైల్లో ఆహారం చాలా ఘోరంగా ఉండేది.  అన్నం నిండా రాళ్ళే ! ఆది భరించలేక నెహ్రుగారు జైలర్ కి ఫిర్యాదు చేశారు.

దానికా ఆంగ్ల జైలర్ " మీ దేశానికి  స్వాతంత్ర్యం కావాలని జైలుకి వచ్చారు. మీరు మీ దేశాన్ని నిజంగా ప్రేమిస్తూ వుంటే తిండి విషయంలో పట్టింపు వుండకూడదు " అన్నాడు వెటకారంగా.

దానికి నెహ్రు బదులిస్తూ " అవును. నేను నిజంగానే నా మాతృభూమిని ప్రేమిస్తున్నాను కాబట్టే ఈ భూమినుంచి తయారైన అన్నం తినాలనుకుంటున్నాను గానీ రాళ్ళనూ, మట్టినీ తినేయ్యాలనుకోవడం లేదు "  అన్నారట.


 


పండిట్ జవహర్లాల్ నెహ్రు వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ..........









Vol. No. 01 Pub. No.300

Wednesday, May 26, 2010

అన్నిటికన్నా పదునైన ఆయుధం

ప్రముఖ కన్నడ రచయిత, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాలను అందుకున్న యు.ఆర్. అనంతమూర్తి గారిని ఒకాయన ' ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అతి పదునైన ఆయుధం ఏమిటి ? ' అని అడిగాడు.

దానికి ఆయన సమాధానమిస్తూ " ఉంది. అదే మన నాలుక ! దానికి ఎటువంటి ఎముకలూ లేకపోయినా, తన సూటి పోటి మాటలతో ఎన్ని గుండెలయినా బద్దలు చేస్తుంది " అన్నారు.



నిజమే కదా ! అంతకంటే పదునైన ఆయుధం వుందా ??


Vol. No. 01 Pub. No. 299

Tuesday, May 25, 2010

మొదటి కృష్ణుడి వివరాలు

 ఈయన పేరు డా. జయసింగ్. 1935 లో వచ్చిన మొదటి ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర ధరించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ పూర్తిగా మరచిపోయిన ఈ నటుడు నాటకరంగం నుండి వచ్చారు. ఈయన రంగస్థలం మీద కృష్ణుడి పాత్రలే ఎక్కువ ధరించారు.  ఆయన ప్రక్కన చాలా నాటకాల్లో కన్నాంబ నటించింది . మైలవరం జమీందారుకు చెందిన ' బాలభారతి ' సమాజంలో చేరి అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు.
ఆ ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలోనే అందాలతార కాంచనమాల, లక్ష్మీరాజ్యం పరిచయమయ్యారు. డా. జయసింగ్ తర్వాత ' భక్త కబీరు' ( భక్త విజయం ) లోను, మరో రెండు బెంగాలి చిత్రాల్లో మాత్రమే నటించారు. ఆయన ప్రధానంగా ఆయుర్వేద వైద్యుడు. తర్వాత కాలంలో నాటకరంగాన్ని వదిలిపెట్టక తన వృత్తి కూడా కొనసాగించారు. కొన్ని ఆయుర్వేద గ్రంథాలు కూడా రచించారు.

కృష్ణుడు ప్రధాన పాత్రలుగా కొన్ని చిత్రాలు - పాత్రధారులు :

1935 - శ్రీకృష్ణ తులాభారం - డా. జయసింగ్
           సతీసక్కుబాయి - దాసరి కోటిరత్నం / తుంగల చలపతిరావు 
           శ్రీకృష్ణలీలలు - సాలూరి రాజేశ్వరరావు ( బాల కృష్ణుడు )
1936 - ద్రౌపదీ మానసంరక్షణ - బందా కనకలింగేశ్వరరావు
           ద్రౌపది వస్త్రాపహరణం - సి.యస్.ఆర్. 
           మాయాబజార్ - ( వివరాలు లభించలేదు ), ఎస్.పి. లక్ష్మణస్వామి - అభిమన్యుడు 
1937 - దశావతారాలు - ( వివరాలు లభించలేదు )
           రుక్మిణీ కళ్యాణం - ( వివరాలు లభించలేదు )
1939 - రాధాకృష్ణ - కృష్ణుడు ( వివరాలు లభించలేదు ), సత్యభామ - స్థానం నరసింహారావు
1942 - సత్యభామ - వై.వి.రావు
1944 - కృష్ణలీల - ( వివరాలు లభించలేదు )
           కృష్ణప్రేమ - జి.వి.రావు
1954 - సతీ సక్కుబాయి - ( వివరాలు లభించలేదు )
1955 - శ్రీకృష్ణ తులాభారం - కె.( ఈలపాట ) రఘురామయ్య
1957 - మాయాబజార్ - నందమూరి తారకరామారావు

ఇవికాక కృష్ణుడి పాత్రకు అంతగా ప్రాధాన్యతలేని చిత్రాలు కొన్ని వచ్చాయి. అందుచేత ఎన్టీ రామారావు ఎన్నో కృష్ణుడో కచ్చితంగా చెప్పడం కష్టమైనా ప్రధాన పాత్రలను తీసుకుంటే మాత్రం సుమారుగా 13 వ కృష్ణుడని చెప్పుకోవచ్చు.
1957 మాయాబజార్ తర్వాత కొంతకాలం పౌరాణికాలు ఎక్కువగానే వచ్చాయి. కృష్ణుడి పాత్రలు ఎక్కువగా ఎన్టీ రామారావు పోషించారు. 
శ్రీకృష్ణ తులాభారం చిత్రాల విషయానికొస్తే మాత్రం ఆయన మూడో కృష్ణుడు. మొదటిది 1935 లో డా, జయసింగ్ నటించినదయితే, రెండవది 1955 లో ఈలపాట రఘురామయ్యది. ఇక మూడవది 1965 లో ఎన్టీ రామారావు నటించినది.

వివరాలు లభించినంతవరకూ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా నాకు లభించని వివరాలు తెలిస్తే చెప్పగలరు.

Vol. No. 01 Pub. No.298

బొమ్మను చేసి ...... ' వేటూరి ' !!


బొమ్మను చేసి ప్రాణము పోసి 
ఆడేవు నీకిది వేడుక 
గారడీ చేసి గుండెను కోసి 
నవ్వేవు ఈ వింత చాలిక !!

హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన "  దేవత "  లోని పాట ఇది. దీనిలో  ' బొమ్మను చేసి  ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక ....' అనే పల్లవి వేటూరిది. అతని అనుమతి మీద, పద్మనాభం కోరిక మీద ప్రారంభంలోని సాకీతో సహా దీన్ని పూర్తి చేసాను.



                                                                                                                .................. అంటారు మహాకవి శ్రీశ్రీ తన ' పాడవోయి భారతీయుడా '  సంకలనంలో. దీన్ని బట్టి వేటూరి వారి సినిమా రంగ ప్రవేశానికి ప్రయత్నాలు చాలా ముందే జరిగాయని అనుకోవచ్చు. అలాగే అప్పట్లో ఆయన ప్రవేశానికి వ్యాపార సూత్రాలు అడ్డుపడి వుండొచ్చు కూడా.



Vol. No. 01 Pub. No. 297

Monday, May 24, 2010

శ్రోతల్లో రకాలు - వక్తలు

1950 వ సంవత్సరంలో  దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రేడియోలో   ' వక్తృత్వము- శ్రోతల మనస్తత్వము ' అనే విషయం మీద చేసిన  ప్రసంగంలో శ్రోతల్లో రకాల గురించి, వారి మనస్తత్వాల గురించి, వారి మధ్యన ప్రసంగం చేసే వక్తల ఇబ్బందుల గురించి హాస్య, వ్యంగ్య ధోరణిలో వివరించారు. ఆ ప్రసంగపాఠం నుండి కొన్ని భాగాలు.......

ఈ వ్యాసం ఈ రోజు B & G లో  ప్రచురితమైంది. ఆ లింక్ ఇక్కడ .................

http://booksandgalfriends.blogspot.com/2010/05/blog-post_24.html


 Vol. No. 01 Pub. No. 296

Sunday, May 23, 2010

సాహితీమూర్తి విశేషాలు

పాటయై వచ్చారు భువనానికి
ధన్యుడై వెడుతున్నారు గగనానికి
అంతిమ యాత్రకూడా పూర్తయింది
ఇక తెలుగు పాటకు ఆ సోగసులద్దేదెవరు ?

తెలుగు సినిమా పాటకు సాహిత్య పరిమళాలు అద్దిన వేటూరి
చెప్పిన కొన్ని విశేషాలు  ........

ఆయన స్వస్థలం గొప్పతనాన్ని చెబుతూ .....

కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లి మా స్వగ్రామం. ఈ తరం వారికి తెలియకపోవచ్చుగానీ గొప్ప శైవక్షేత్రం. కళ్ళేపల్లి వద్ద కృష్ణ ఉత్తరానికి తిరుగుతుంది.  అంచేతే పెదకళ్ళేపల్లిని దక్షిణ కాశీ అంటారు. ఈ వూరు శివాలయంలో శివలింగం వుండదు. నాగం వుంటుంది. అన్నీ నాగ శబ్దంతో మొదలవుతాయి.
తెలుగునాట  భావ కవితకు ఆద్యుడు కొడాలి సుబ్బారావు ఇక్కడివాడే !
త్యాగరాజు శిష్యులలో ముఖ్యుడు ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్యగారు నడయాడిన నేల ఇది. సుబ్బయ్య గారి శిష్యులు సుసర్ల దక్షిణామూర్తి, ఆయన శిష్యుడు పారుపల్లి, ఆయన శిష్యుడు బాలమురళీకృష్ణ ... చూసారా ఎంత గొప్ప పరంపరకు ఇది తార్కాణమో !
నాదస్వర వాదనలో దక్షిణాదిలోనే పేర్గాంచిన దాలిపర్తి పిచ్చిహరి ఇక్కడివాడే !
ఛత్రపతి శివాజీ సేనలో ముఖ్యుడు, కమాండర్ మరాఠీ వెంకటభోట్లు ఇక్కడివాడే మాపూర్వీకుడే !
వోకనాటి రంగస్థల స్రష్ట శ్రీరామవిలాస సభ వ్యవస్థాపకుల్లో వొకరు చల్లా లక్ష్మీకాంతం  మా ఊరివాడే !

ఆయన సాహిత్య నేపథ్యం గురించి......

మా తాతగారు వేటూరి సుందరశాస్త్రి గారు మంచి పండితుడు. ' కదళి మహత్యం ' అని వో గ్రంథం రాసారు. మా కళ్ళేపల్లి పై రాసిన గ్రంథమది. నా గురువు, ఆత్మగురువు నా తండ్రిగారైనటువంటి చంద్రశేఖరశాస్త్రి గారు. ఆయన వొడిలోనే తొలి అక్షరాలు దిద్దాను. మా అమ్మ కమలాంబ. నా సరస్వతి. నా సమస్త అక్షరం. అమ్మవాక్కు, నాన్నదీవెనలే నా జీవన చేతనకు పునాదులు. మా పెదనాయిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. గొప్ప శాసన పరిష్కర్త.

'శంకరాభరణం' చిత్రం ప్రారంభోత్సవం గురించి చెబుతూ ..... 

ఆది ' శంకరాభరణం ' ప్రారంభ సమయం. పూజ మొదలుపెట్టారు. మూడు కొబ్బరికాయలు వున్నాయి. విశ్వనాథ్ గారు వచ్చి నన్నొకటి, మహదేవన్ ని వొకటి కొట్టమన్నారు. " నా సినిమాలో హీరో అరవై ఏళ్ళ వాడయ్యా ! ఇదో సాహసం. నిజానికి మీరిద్దరే ఈ సినిమాకి హీరోలు " అంటూ నాభుజం మీద, మామ భుజం మీద చేతులు వేసి ఆర్ద్రంగా చెప్పారు విశ్వనాథ్. ఆయన కలం నిజం చేసాం. ఆ సినిమా ఓ టెక్నిషియన్ గా నాకు సార్థకత.

మువ్వ గోపాల పదాల గురించి, వాటి సృష్టికర్త క్షేత్రయ్య గురించి..........

మనవాళ్ళకి చరిత్రమీద ఆట్టే గురి, గౌరవం లేవు. క్షేత్రయ్యను తీసుకొచ్చి కృష్ణా జిల్లావాణ్ని చేసారు. మొవ్వలో ఆయన నివసించాడని అక్కడే మువ్వగోపాల పదాలు రాసాడంటున్నారు. ఆది తప్పు. క్షేత్రయ్య అసలు పేరు అర్భకం వరదయ్య. ఆయన ఉండేది కంచి దగ్గర. ఆయన చేసిన ప్రయోగాలు గమనిస్తే చాలా చోట్ల నవ్వినీ, చూసినీ అని వుంటాయి. ఆది రాయలసీమ మాండలీకం. మువ్వగోపాలుడున్న ప్రాంతం వేరు. కార్వేటినగరంలో మువ్వగోపాలుని ఆలయం వుంది. అక్కడ కృష్ణుడికి వళ్ళంతా మువ్వలే వుంటాయి. నెమలి ఫించం, మురళీ, కాళ్ళకు, చేతులకు అన్నీ మువ్వలే. వ్యాకరణం ప్రకారం చూసినా మెవ్వ - మువ్వ అవదు. ఈ చారిత్రిక పరిశోధన లేకుండా మొవ్వ క్షేత్రయ్య ఊరని, వేణుగోపాలస్వామి ఆలయం వుంది కాబట్టి అక్కడే క్షేత్రయ్య వుంటాడని చెబుతూ బోర్డులు కట్టడం చూస్తే నాకు బాధ వేసింది. చరిత్ర పట్ల గౌరవం పరిశోధనా లేని జాతైపోయింది మనది.

( 1997 వ సంవత్సరంలో వేటూరిగారు ఆంధ్రజ్యోతి వారపత్రికకిచ్చిన ఇంటర్వ్యూ నుంచి సేకరించిన కొన్ని విశేషాలు ) 


వేటూరి వారి గురించి గతంలో రాసిన తెలుగు పాటకు చిరునామా వేటూరి  చూడండి.


Vol. No. 01 Pub. No. 295

రాలిపోయిన పువ్వు




పగిలే ఆకాశం నీవై 
జారిపడే జాబిలివై 
మిగిలే ఆలాపన నీవై 
తీగ తెగే వీణియవై


రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.....

                                         
                                             తెలుగు పాటను దశదిశలా వినిపించిన కవితాకుసుమం
                                             తెలుగు పాటకు సాహిత్య పరిమళాలు అద్దిన సాహితీ మూర్తి

తెలుగు చిత్రరంగం గర్వంగా చెప్పుకునే 'గీతా' మకరందము
తెలుగు చిత్రగీతాకాశంలో ఆలాపనగా మిగిలిపోయిన వేటూరి

ఆ పువ్వు రాలిపోయింది - ఆ కలం ఆగిపోయింది 
ఆ గీతం మూగవోయింది - ఆ సాహితీవనం బోసిపోయింది

ఇవేవీ నిజం కావు
వేటూరీ మీకు మరణం లేదు
మీ పాటలో మీరు ఎప్పటికీ సజీవులు
తెలుగువారి గుండెల్లో మీపాటలు చెరిగిపోని ముద్రలు 


వేటూరి గారికి శ్రద్ధాంజలి

వేటూరి వారి గురించి గతంలో రాసిన తెలుగు పాటకు చిరునామా వేటూరి  చూడండి.

Vol. No. 01 Pub. No. 294

Friday, May 21, 2010

తుఫాను లీల



లైలా తుఫాను లీల ఈ రోజు సాయింత్రం వరకూ కొనసాగింది. ఇదే లైలా తుఫాను తిరిగి సముద్రంలోకి ప్రవేశించి ఒడిస్సా వైపు పయనించి మళ్ళీ తీరం తాకుతుందని, మరో తుఫాను ముప్పు పొంచి వుందని దానికి ' బంద్ ' అనే పేరు కూడా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న లైలా తీరం దాటిన విషయంలో కూడా అధికారుల మధ్య, మీడియాలోను గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో బాపట్ల దగ్గర  తీరం దాటినట్లు ఒక వార్తా ఛానల్ ప్రసారం చేస్తే కొన్ని చానెళ్ళు సందిగ్డంగానే ప్రకటించాయి. దానికి ముందు వరకూ మచిలీపట్టణం దగ్గర తీరం దాటే అవకాశం అధికంగా వుందని వార్తలు పదే పదే ప్రసారమయ్యాయి. ఆ ప్రాంతంలో ప్రజలకు సహాయం అవసరమవుతుందని వెళ్ళిన మాకు అక్కడ దాదాపుగా ప్రశాంత వాతావరణం ఎదురయ్యింది. అప్పుడప్పుడు కొద్దిగా గాలి, కొద్దిగా వర్షం మాత్రమే అక్కడ కనబడింది. గ్రామాలన్నీ అధికారులు ముందే ఖాళీ చేయించడంతో ప్రశాంతంగా వుంది. తుఫాను ముందు ప్రశాంతత ఏమో అనుకున్నాం. కాసేపటికి బాపట్ల దగ్గర తీరం దాటిందని, కాదు ఒంగోలు దగ్గర దాటిందని రకరకాల వార్తలు వచ్చాయి. దేశమంతా కలవరపడుతున్నా తుఫానులకు అలవాటు పడ్డ మచిలీపట్టణం ప్రజలు ఎప్పటిలాగే వాళ్ళ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోయున్నారు. తుఫాను గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదనిపించింది. ఆది నిజమేమో కూడా ! ప్రతి సంవత్సరం ఎదురయ్యే పరిస్థితి ఇది.

కోస్తాప్రజల జీవితాల్లో తుఫానులు, వరదలు వాటితో వచ్చే నష్టం కూడా ఒక భాగమైపోయాయి. ప్రజల బలహీనతలతో ఆడుకునే రాజకీయనాయకులకి, వాళ్ళను గుడ్డిగా అనుసరించే అమాయక ప్రజలకు సస్యశ్యామలంగా కనిపించే కోస్తాయే కనబడుతుంది. ప్రతి సంవత్సరం ఇలా రెక్కల కష్టం కొంత ప్రకృతి పాలబడితే, మరికొంత నాయకుల అండతో చక్రం తిప్పే దళారుల పాలవుతుంటే ఎవరు కాపాడుతున్నారు ? అమాయక ప్రజల మధ్య ప్రాంతీయ, కుల, మత బేధాలు రెచ్చగొట్టే నాయకులకు ఈ కష్టం ఏం అర్థమవుతుంది ?  ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఏ ప్రాంతం పరిస్థితులు, కష్టాలు వారివి. ఒక ప్రాంతం పచ్చగా వుందని, మరొక ప్రాంతం ఎండిపోయిందని - ఒక ప్రాంతం ప్రజలు సుఖపడిపోతున్నారని, మరొక ప్రాంతం ప్రజలు కష్టపడిపోతున్నారని అనుకోవడం మన అజ్ఞానమే కానీ మరేదీ కాదని అప్పుడప్పుడు ఇలా ప్రకృతి మనకు గుర్తు చేస్తుంది.

ఇక ప్రస్తుతానికి వస్తే తీరం దాటిందో లేదో తేలని స్థితిలో రాబోయే విపత్తుని ఎదుర్కోవడానికి వేచి చూస్తున్న మాకు తీరం దాటిన విషయం మీద ఖచ్చితమైన వార్త సాయింత్రం ఆరుగంటల తర్వాత చేరింది. మరో గంట అక్కడే వుండి ఇక ఏ భయం లేదని తేలిన తర్వాత వెనుదిరిగాము. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందనుకున్న ఈ రోజుల్లో కూడా ఈ సందిగ్ధత, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, అసలే అయోమయంలో వున్న ప్రజల్ని గందరగోళ పరిచే విధంగా ఎందుకున్నాయి అనే విషయం అర్థం కావడం లేదు.

1990 మే 9 వ తేదీ మచిలీపట్టణం దగ్గర తీరం దాటిన పెను తుఫాను  కృష్ణా జిల్లాలో, విజయవాడ నగరంలో విధ్వంసం సృష్టించింది. అప్పుడు ఇప్పుడున్నంత పటిష్టమైన సమాచార వ్యవస్థ లేదు. తుఫాను పరిస్థితి తెలుసుకోవాలంటే రేడియో, దూరదర్శన్ మాత్రమే ఆధారం. అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ లాంటివేవీ లేని రోజులవి.  ముందు రోజు వాతావరణ నివేదిక ప్రకారం చెప్పిన సమయానికి, ప్రదేశానికి కొంచెం అటూ, ఇటూగానే తీరం దాటడం జరిగేది. సెల్ ఫోన్ అంటే అసలే తెలీదు. నగరాలలోనే ఎస్టీడీ ఫోన్ బూత్ లు రెండు, మూడు కిలోమీటర్లకు ఒకటిగా ఉండేవి. తుఫానులో చిక్కుకున్న ప్రాంతాల్లో వున్న వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో హైదరాబాద్ గాంధీనగర్లో ఉండే మాకు దరఖాస్తు చేసి ఆరునెలలైనా ఫోన్ రాలేదు. దగ్గరగా ఉండే ఎస్టీడి బూత్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండేది. అక్కడ మామూలు రోజుల్లోనే టోకెన్ పధ్ధతి ఉండేది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాలా ? మన వంతు వచ్చినా సాంకేతికంగా ఇంత అభివృద్ధి లేకపోవడం, తుఫాను తాకిడి ప్రాంతాలలో కేబుల్స్ తెగిపోవడం లాంటి కారణాలవలన అంత సులువుగా కావాల్సిన నెంబర్ దొరికేది కాదు. ఆ సమయంలో ప్రైవేటు టెలిఫోన్ సంస్థల పోటీ లేదు. అయినా మన టెలిఫోన్ శాఖ తుఫాను సమాచారం తెలుసుకోవడానికి అప్పట్లో చక్కని అవకాశం కల్పించింది. తుఫాను తాకిడి ప్రాంతాలకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది. అప్పట్లో ఇన్ని కస్టమర్ సర్వీసు కేంద్రాలు లేవు. మాకు దగ్గరలో చిక్కడపల్లిలో ఉండేది. అక్కడ మూడు ఫోన్లు కాబోలు ఉండేవి. ఈ సౌకర్యం గురించి తెలియగానే వెళ్ళడం వలన మాకు తేలిగ్గానే అవకాశం వచ్చింది. కాకపోతే షరా మామూలే ! లైన్లు దొరకడం కష్టమయ్యేది. ప్రయత్నించి, ప్రయత్నించి చాలాసేపటికి క్షేమ సమాచారాలు తెలుసుకోగలిగాం ! అయితే ఒకసారి సమాధానం రాకపోతే తర్వాత వారికి అవకాశమిచ్చి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించడం లాంటి స్వీయ నియంత్రణ పాటించడం వలన జనం ఎక్కువగా వచ్చినా అందరికీ అవకాశం దొరికేది.  

ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని పెద్దది చేసి చూపి ప్రజలను ఆందోళనకు గురిచేసిందా లేక వాళ్ళు అలా చెయ్యడం వలన ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో ఉందా అంటే చెప్పడం కష్టం. దీంట్లో మంచి చెడులు నిర్ణయించే కంటే ప్రజలు కొంత ఆందోళన కలిగినా ప్రభుత్వపరంగా విపత్తు జరిగాక చేపట్టే సహాయ చర్యలకంటే ఎక్కువ ముందు జాగ్రత్త తీసుకున్నట్లు కనిపించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధపడే ప్రజలందర్నీ తమ ఏర్పాట్లతోను, ముందు జాగ్రత్త చర్యలతోనూ తృప్తి పరచడం సాధ్యం కాకపోయినా కోస్తా ప్రాంతమంతా సహాయ చర్యల్లో పాల్గొని నిజంగా భయపడినంత పెనుతుఫాను ముంచుకొచ్చినా ప్రాణనష్టం తగ్గించేందుకు నిద్రాహారాలు మాని కృషి చేసిన ప్రభుతోద్యోగులు అభినందనీయులు. ఈ మూడు రోజులు వారి కృషికి కరుణించిందేమో తుఫాను కూడా తలవోగ్గింది. ఒడ్డున కూర్చుని చెప్పడం చాలా సులువు. ముఖ్యంగా తీరప్రాంతంలో ప్రాణాలకు తెగించి ఎవర్నీ సముద్రంకేసి వెళ్ళనివ్వకుండా గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు, ప్రమాద నివారణా విభాగ సిబ్బంది సేవలు నిరుపమానం. భయంగోల్పుతున్న కెరటాల అంచున వున్నది వాళ్ళే ! ఉపద్రవం వస్తే మొదట బలయ్యే అవకాశం వున్నది వాళ్ళకే ! అందుకే వారి సేవలకు జోహార్లు.

పెనుముప్పు జరగబోతోందని భయపెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసి తీరం దాటకుండా, ఎక్కడ దాటుతుందో, అసలు దాటిందో లేదో అర్థం కాకుండా, దాటాక ఎటు మళ్ళుతొందో అర్థం కాక చాలాసేపు దోబూచులాడిన ఈ లైలా తుఫాను లీల ఇక్కడితో పూర్తయిందా ? మరో తుఫాను రూపంలో మళ్ళీ వస్తుందా ? చూడాలి. 

Vol. No. 01 Pub. No. 293

మొదటి కృష్ణుడు

 కనుక్కోండి చూద్దాం - 16



తెలుగు చలనచిత్ర రంగంలో కృష్ణుడు అంటే అందరికీ గుర్తుకొచ్చేది స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు.

< ఈ ప్రక్క ఫోటోలో ఉన్న వ్యక్తి మన తెలుగుతెరమీద కనిపించిన మొదటి కృష్ణుడు. 
* ఈయన పేరేమిటో చెప్పగలరా ?
* ఈయన కృష్ణుడిగా నటించిన చిత్రం పేరు, విడుదలయిన సంవత్సరం చెప్పగలరా ?
* ఈయన మొదటి కృష్ణుడయితే ఎన్టీ రామారావు ఎన్నో కృష్ణుడు ? 






Vol. No. 01 Pub. No. 292

Wednesday, May 19, 2010

ప్రకృతికి ప్రశ్నలు

 మొన్న క్రోధంతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణవేణమ్మ
విరుచుకుపడింది తన ప్రవాహానికి అడ్డుకట్టిన ఊళ్లమీద

నిన్నటివరకూ నిప్పులు చెరిగిన భానుడు
చెలరేగిపోయాడు తనని కూడా లెక్క చెయ్యని జనం మీద

ఈరోజు ఆగ్రహంతో ఊగిపోతున్న సముద్రుడు
విరుచుకుపడబోతున్నాడు మరోసారి సామాన్య ప్రజల మీద

ఓ కృష్ణమ్మా ! ఓ భానుడా ! ఓ సాగరుడా !
మీకు కూడా డొక్కలెండిన సామాన్యుడే లోకువా ?
మీ ప్రవాహంతో అవినీతిని కడగలేరా ?
మీ ప్రతాపంతో అన్యాయాన్ని భస్మం చెయ్యలేరా ?
మీ అలల వేగంతో కుత్సితం నిండిన వ్యవస్థను ముంచెత్తలేరా ?




Vol. No. 01 Pub. No. 291

Tuesday, May 18, 2010

భవిష్యత్తుకు బీజాలు

ప్రతి మనిషి ప్రవర్తనకు, జీవన శైలికి అతని బాల్యంలోని సంఘటనలే కారణమవుతాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలోను కొన్ని స్వంత ఇష్టాలు, అభిరుచులు వుంటాయి. అయితే అవి ఏర్పడడానికి బీజాలు మాత్రం బాల్యంలో వుంటాయి.   సాధారణంగా చిన్నతనంలో పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అనుకరిస్తారు. కాస్త ఊహ తెలిసాక తమ చుట్టూ వుండే పరిసరాలు, పరిస్థితులలోంచిగానీ, వ్యక్తుల ప్రభావం వలన గానీ ఈ ఇష్టాలు, అభిరుచులు ఏర్పరుచుకోవచ్చు.

ఉదాహరణకు ఒక డాక్టర్ పిల్లలు ఆడుకునే ఆటల్లో సాధారణంగా హాస్పిటల్ కి సంబంధించిన ఆటలు ఆడుకోవచ్చు. లేదా ఏదో కారణం వలన తరచుగా ఆస్పత్రికి వెళ్లి వచ్చే పిల్లలు కూడా తమకు బాగా పరిచయమైన ఆస్పత్రి, డాక్టర్ ఆటలు ఆడుకోవడానికి ఉత్సాహం చూపవచ్చు. మా చిన్నతనంలో డిటెక్టివ్ పుస్తకాలు ఎక్కువగా వస్తుండేవి. అవి చదవడం అలవాటయ్యాక మేము అప్పుడప్పుడు ఆ కథల్ని ఆటలుగా ఆడుకునేవాళ్ళం. మంచి నాటకం చూస్తే స్నేహితుల్ని పోగేసి ఇంట్లోనే తెరలు కట్టి అవే నాటకాల్ని మాకు తోచిన రీతిలో ప్రదర్శించేసేవాళ్ళం. సినిమా చూసి వచ్చాక కొద్దిరోజులు ఆ సినిమాలో పాటల్ని, ఫైట్లనీ అనుకరించేవాళ్ళం.

ఇలా నా అభిరుచులకి, ఇష్టాలకి మూలమైన పరిస్థితులు, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి నా స్వ ' గతం ' పేజీలో వేసవి ముచ్చట్లలో ............... 

Vol. No. 01 Pub. No. 290

Monday, May 17, 2010

పగలేవెన్నెల

పగటి పూట చుక్కలు కనిపించేనా ?
సూర్యుడు పడమర ఉదయించేనా ?
చంద్రుడు తూర్పున అస్తమించేనా ?
రాత్రి తిరిగే గుడ్లగూబ పగలే ప్రత్యక్షమయ్యేనా ?
ఏమో ! ఈ కలికాలంలో ఏదైనా సాధ్యమేమో !

................  ఎక్కువదూరం చూడగలిగే శక్తి, రాత్రి పూట స్పష్టంగా చూడగలిగే శక్తి, తలను సుమారు 270 డిగ్రీల కోణంలో త్రిప్పి చూడగలిగే శక్తి కలిగిన గుడ్లగూబ పగటిపూట కనిపిస్తే.... ! అలా కనిపించిన ఓ గుడ్లగూబ ఇదిగో ....




Vol. No. 01 Pub. No. 289

Saturday, May 15, 2010

కాటన్న జన్మదినం

 మా కాటన్న పుట్టిన రోజట నేడు
ఆంధ్రను అన్నపూర్ణగా మార్చిన మంత్రగాడు

అతడు కేవలం ఓ ప్రభుత్వాధికారి
అదీ పరాయి ప్రభుత్వ ఉద్యోగి 

ప్రజాసేవే పరమార్థంగా పనిచేసిన నిస్వార్థజీవి
కరవు రక్కసి కోరల్నుంచి రాష్ట్రాన్ని రక్షించిన ధన్యజీవి

అతని జీవితం నేటి మన ' స్వంత ' పాలకులకు, అధికార్లకు ఒక పెద్దబాలశిక్ష  
అతని జీవితంనుంచి  వారు  తెలుసుకోవలసినది, నేర్చుకోవలసినది ఏమీ లేదా ?   

 ' సర్ ఆర్థర్ కాటన్ ' జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ.........
ఆయనపై గతంలో రాసిన అపర భగీరధుడు చదవండి.

Vol. No. 01 Pub. No. 288

ఆనంద తాండవం ' చిదంబరం '

ఆనంద తాండవమాడే శివుడు 
చిదంబర నిలయుడు 

అక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తే
చూసిన మన మనసు అంబరాన్ని తాకుతుంది .
ఆ ఆలయంలో ప్రతి స్థంభం నాట్యం చేస్తుంది
ఆ ఆలయంలో ప్రతి శిల్పం నర్తిస్తుంది

చెన్నైకి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో చెన్నై - తిరుచ్చి ప్రధాన రైలు మార్గంలో వున్న చిదంబరం లోని నటరాజ ఆలయ విశేషమది. శివుడు నటరాజుగా కొలువు తీరి వున్న ఆలయం చిదంబరం నటరాజ ఆలయం. శైవ, వైష్ణవ సిద్ధాంతాల మేలుకలయిక ఈ ఆలయం.

పంచభూతాలకు ప్రతిరూపంగా వెలసిన అయిదు ఆలయాల్లో చిదంబరంలోని ఆలయం ఆకాశానికి గుర్తు. మన మనసనే ఆకాశానికి చిహ్నం చిదంబరం. క్రీస్తు యుగం ప్రారంభానికి ముందే ఈ ఆలయమున్నట్లు చెబుతారు. శిధిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని చోళ రాజులు పునరుద్ధరించారు. వారి తర్వాత పల్లవులు, విజయనగర రాజులు ఈ ఆలయ వైభవానికి కృషి చేశారు.
ఈ ఆలయంలో అయిదు మంటపాలున్నాయి. అవి చిత్ సభ, కనక సభ, నాట్య సభ, రాజ్య సభ, దేవ సభ. ఇక్కడున్న శిల్ప రమణీయత చెప్పనలవికాదు.

చిదంబర రహస్యం : గర్భగుడిలోని నటరాజ విగ్రహానికి ఎడమవైపున శివగామి అమ్మవారు వుంటారు. కుడివైపున మాయా యవనిక ( ఒక నల్లని తెర ) వుంటుంది. దాని మీద కొన్ని బంగారు ఆకుల తోరణాలు వుంటాయి. ఎవరైనా అలౌకిక దృష్టితో తదేకంగా చూసినపుడు అక్కడ ఒక స్పష్టమైన రూపాన్ని దర్శిస్తే ఆది అనంతమైన శూన్యానికి అంటే ఆకాశానికి చిహ్నమవుతుంది. గర్భగుడిలో ఉండే శ్రీచక్రం, చిదంబర చక్రం, సమ్మేళన చక్రం, మహాతాండవ చక్రం, తిరస్కరణి చక్రం, ఆనంద చక్రం కలసి ఈ చిదంబర రహస్యాన్ని ఏర్పరుస్తాయని చెబుతారు. వీటిద్వారా ఆకాశ స్థానంలోని మూల ( కేంద్ర ) స్థానాన్ని చూడగలుగుతామట. ఒక గొప్ప సిద్దునికి పంచాక్షరి చక్రం మీద శ్రీచక్రం కలసి అందులోంచి నటరాజ రూపం సాక్షాత్కరించినదని చెబుతారు. ఈ యంత్రం అనంత విశ్వానికి ప్రతిరూపం. ఈ ఆకాశ లింగమే చిదంబర రహస్యం. అందుకే ఇక్కడ శివుడు నిరీశ్వరాకారుడు.

ఊర్థ్వ తాండవమూర్తి అయిన నటరాజు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ. అద్భుతమైన శిల్ప రమణీయత, వాస్తు శైలి ఆ ఆలయ విశేషం. ఈ వేసవి యాత్రలో భాగంగా చిదంబర ఆలయాన్ని దర్శించిన సందర్భంగా కొన్ని విశేషాలు ఇవి. ఇంకా కొన్ని చిత్రాలు......



Vol. No. 01 Pub. No. 287

Wednesday, May 12, 2010

బొమ్మల పెండ్లి

  సాధారణంగా పిల్లలకు పెద్దల్ని అనుకరించడం అలవాటు. పుట్టిన వెంటనే బిడ్డ తన చిరునవ్వు నుంచి, నడక, మాట, ప్రవర్తన, అలవాట్లు ఇలా అన్నీ తన కంటే పెద్దవారి నుంచి ముఖ్యంగా తమ తల్లిదండ్రులు, అక్కలు, అన్నల నుంచి నేర్చుకునేది ఎక్కువగా వుంటుంది. తర్వాత కాలంలో స్నేహితులు, ఉపాధ్యాయులు మొదలైన వారినుంచి, తాము చదువుకున్న పుస్తకాలలోని గొప్ప వ్యక్తుల జీవితాలను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే తాము చూసే సినిమాలలోని నటులను అనుకరించాలనే భావన కూడా వారిలో వుంటుంది.

 అలాంటి అనుకరణలోంచి వచ్చినదే గతతరంలోని పిల్లలు ఆడుకున్న అచ్చ తెలుగు ఆట బొమ్మల పెళ్లి. ముఖ్యంగా వేసవి సెలవలిస్తే ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా కలసి తాటియాకు బొమ్మల్ని చేసుకుని వాటిని సింగారించి, కొబ్బరి బూరాలు చేసుకుని అట్టహాసంగా పెళ్లి జరిపేవారు. టీవీలు, కంపూటర్లు వచ్చి వీటినన్నిటినీ మింగేసిన నేపథ్యంలో ఒక్కసారి ఆ ఆటను గురించి పేరడీ రచనలకు పేర్గాంచిన జరుక్ ( జలసూత్రం రుక్మిణీనాథ ) శాస్త్రి గారి వర్ణన చూద్దాం !


 తాటియాకుకు కాటికా బొట్టు పెట్టి
చీర సింగారించి షోకు జేశారు !


గాజు పూసలపేరు మెళ్ళో వేశారు
గౌరీ కళ్యాణాల రేఖ దిద్దారు !


పానకం బిందెలూ సిద్ధపరిచారు
పాప పేరంటాండ్రు కాచుకున్నారు !


లక్కపిడతలో అన్నముడికి పోయింది
లక్కచట్టిలో పుప్పు ఉడికిపోతోంది


పెళ్ళికూతురు మామ కట్నాల కోసం
చింతగింజలు లెఖ్ఖపెట్టి దాచాడు


ఉత్తుత్తి అలజడి జరిగిపోతోంది
ఉత్తుత్తి బాజాలు మ్రోగుతున్నాయి


కబురు మీదా కబురు వెళ్ళింది కాని,
పెళ్ళికొడుకులవారు  తర్లిరాలేదు !!

ప్రముఖ కవి దాశరధి రేడియో కోసం రాసిన పిల్లల పాట గురించి తృష్ణ గారు గతంలో తన బ్లాగులో రాసారు. ఒకసారి ఆ టపా చదివి ఈ పాట వినండి.



Vol. No. 01 Pub. No. 286

Tuesday, May 11, 2010

జీవితచక్రం

నాడు దర్జాగా తిరిగిన దర్జీ చక్రం
నేడు రోడ్ల పాలైన పరిణామ క్రమం

ఒకప్పుడు బట్టలు టైలర్ మేడ్
మరిప్పుడు అవే రెడీమేడ్


కంపెనీల మెరుస్తున్న బట్టలు
కొట్టాయి కాలుతున్న పొట్టలు

ఒకప్పుడు మన దగ్గరకే జనం
మరిప్పుడు జనం దగ్గరకే మనం



పని దొరికితేనే కడుపులు నిండేది 
చక్రం తిరిగితేనే జీవిత చక్రం తిరిగేది

అప్పుడే మా జీవితాల్లో వెలుగులు నిండేది
లేకపోతే చీకటే మాకు మిగిలి వుండేది  







Vol. No. 01 Pub. No. 289

Monday, May 10, 2010

అచ్చు తప్పుకు ఆఠాణా

తెలుగు ప్రచురణ రంగానికి ఆద్యులు, తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన మహానుభావుడు స్వర్గీయ వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారు. అనేక ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి, వాటిని ప్రచురించిన ఘనత ఆయనకే దక్కింది.  తెలుగులో వున్న వ్రాత ప్రతులను  ముద్రణా పద్ధతిని వుపయోగించి తమ ' ఆది సరస్వతీ ముద్రణాలయము ' ద్వారా ప్రచురించింది వావిళ్ళ వారే ! సి. పి. బ్రౌన్ పరిష్కరింపజేసిన ఎన్నో గ్రంథాలను ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చారు.

సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని రోజుల్లో ముద్రణా పద్ధతుల్లో కొత్త పుంతలు తొక్కి నాణ్యమైన గ్రంథాలను తెలుగువారికి అందించారు. వారి గ్రంథాలలో మచ్చుకైనా ఒక్క తప్పు కూడా కనబడేది కాదట. ముద్రణకు పూర్వమే అచ్చుతప్పులను సవరించడానికి ఉద్ధండులైన పండితుల్ని నియమించేవారు. వీరి లోపాలులేని ముద్రణ పైన ఆసక్తికరమైన కథనాలెన్నో ఉండేవి.  వాటిలో మచ్చుకి  ఒకటి.........

రామస్వామిశాస్త్రి గారు తన ముద్రణాలయం బయిట ముద్రణకు సిద్ధం చేసే ఫారాన్ని ప్రదర్శనకు పెట్టి
' మేము ప్రచురించిన గ్రంథములో అచ్చుతప్పులేరి చూపించిన వారికి ఒక దోషమునకు ఎనిమిది అణాలు చొప్పున  ఇస్తాం ! '
అని ప్రకటించేవారట.  తాను ప్రచురించిన గ్రంథాలపై ఆయనకు వున్న నమ్మకం అలాంటిది.

" వావిళ్ళవారి కృషి లేకున్న పక్షమున, వైదిక పురాణాది గ్రంథములు విస్మృతిలో నశించియుండును. కాలవాహినిలో అందరునూ కలిసిపోయి విస్మరింపబడినప్పటికీని, శ్రీ వావిళ్ళ వారి కృషి అమర ప్రాయము పొంది నిలువగలదు "
అని ప్రశంసించారు డా. కట్టమంచి రామలింగారెడ్డి గారు.

పిఠాపురం మహారాజావారు వావిళ్ళవారి గురించి
" సారస్వతవ సేవయే వారి ఆశయము. ఆంధ్రులకు జ్ఞాన దానము చేసినారు. ఆంధ్ర, తమిళ, కర్నాటక, సంస్కృత భాషలందు గ్రంథములు ప్రచురించి భాషా సేవా గావించుచూ ధన్యులై, విద్యావంతులై గుణగ్రహణ ప్రావీణులై యుండిరి "
అని ప్రస్తుతించారు.

తెలుగు గ్రంథ ప్రచురణకు మార్గదర్శకులైన స్వర్గీయ వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారు 1891 వ సంవత్సరము మే నెలలో (  తేదీ లభ్యం కాలేదు ) దివంగతులైనారు. తెలుగు ప్రచురణకర్తలు వావిళ్ళవారిని స్మరించుకోవడం తమను తాము గౌరవించుకోవడమే ! వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారికి సాహితీ నీరాజనాలు అర్పిస్తూ..........

వావిళ్ళ వారిపై గత టపాలు - పుస్తకానికి గజకేసరి యోగం , తెలుగు ముద్రణారంగ పితామహులు 

Vol. No. 01 Pub. No. 288

Sunday, May 9, 2010

అమ్మ అన్నది కమ్మని మాట


 ' అమ్మ ' అనేది ఒక కమ్మని మాట
అమ్మ అంటేనే కోటి వరహాల మూట
అమ్మంటేనే ఒక తీయని భావనన్నమాట




అమ్మంటే మనసున తేనెలూరు
అమ్మంటే ప్రేమకు మారుపేరు
అమ్మకెవరూ ఇలలో సాటి రారు







అమ్మను మించి దైవమున్నదా ?
అమ్మను కాదనే ధైర్యమున్నదా ?
అమ్మను లేదనే జాతి వున్నదా ?

 






అమ్మంటే కదిలే దేవత
అమ్మంటే కనిపించే దీపం
అమ్మంటే మన ప్రాణం  




అమ్మ కన్న మిన్న అయిన కావ్యం ఎవరు రాయగలరు ?
అమ్మ కన్న మిన్న అయిన మాట ఎవరు చెప్పగలరు ?
అమ్మ కన్న మిన్న అయిన పాట ఎవరు నేర్పగలరు ?







అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాభినందనలు 

Vol. No. 01 Pub. No. 287

Saturday, May 8, 2010

ఫలరాజు ' పనస '

మృగాలన్నిటికీ రాజు సింహం 
ఫలాలన్నిటికీ రాజు   పనస 

పనసపండు ఆకారంలోనే కాదు ఉపయోగంలో కూడా పెద్దదే ! పనసపండులో ఉపయోగపడని భాగమంటూ లేదు. తొనల సంగతి చెబితే అందరికీ నోరూరుతుంది కదా ! గింజలతో కూర చేస్తారు. దుంప కూరల రుచికి ఏమాత్రం తీసిపోదు. తొనలు తీసేసాక మిగిలిన భాగాన్ని కొంతమంది పారేస్తారు. కానీ కొన్ని ప్రాంతాలలో వాటిని శుభ్రం చేసుకొని పులుసు లాగ పెట్టుకుంటారు. అది ఎంత రుచిగా ఉంటుందని !

ఇక పనస ఆకులలో ఔషధ గుణాలుంటాయంటారు. అందుకేనేమో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో వాటిని బుట్టలుగా అల్లి ' పోట్టెంకలు '  అని చేసుకుంటారు. సుభద్ర గారు వాటిని చేసే విధానం గురించి, రుచి గురించి తన బ్లాగు వాలుకొబ్బరిచెట్టు లో  సచిత్రంగా వివరంగా రాసారు.

సరే పనస చెక్క ఫర్నిచర్ తయారీకి, గృహనిర్మాణ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆది చాలా నాణ్యత కలిగి ఉంటుందంటారు. ముఖ్యగా చెదలు లాంటివి పట్టవని చెబుతారు.

ఇన్ని చెప్పి పనస పొట్టు గురించి చెప్పకపోతే ఫలరాజుకు ద్రోహం చేసినట్లే ! పచ్చిగా వున్న పనసకాయను తీసుకొని దాన్ని పొట్టుగా కొట్టే విధానం నుంచి దాంతో కూర చేసే విధానం దాకా అన్ని దశలలోనూ దాని ప్రత్యేకత దానిదే ! ఇప్పుడంటే మిక్సీలు వగైరా వచ్చేసి పని సులువు చేసాయి గానీ గతంలో పనసపొట్టు కొట్టడమంటే అదొక బృహత్కార్యము. పదును మీద వున్న పనసకాయను కోసి దాన్ని పైన ఉండే తొక్కను వలుస్తారు. అప్పుడు జిగురులాంటి పదార్ధం వస్తుంది. ఆది చేతులకు అంటకుండా నూనె రాసుకుంటారు. పొట్టు కొట్టడానికి ప్రత్యేకమైన కత్తి వుంటుంది. కాయకు మధ్యన పట్టుకోవడానికి వీలుగా పెద్ద మేకు గానీ, అట్లకాడ గానీ గుచ్చుతారు. దాన్ని పట్టుకుని కత్తితో సున్నితంగా కొడ్తూ వుంటారు. అలా సుమారుగా వున్న ఒక కాయ కొట్టడానికి సుమారు ఏడు, ఎనిమిది గంటల వరకూ సమయం పడుతుంది. ఒక్కోసారి ఇద్దరు కలసి చెరోవైపు రెండు కత్తులతో కొడతారు. అలా ఓపిగ్గా, సున్నితంగా కొడితే వచ్చే పొట్టు చాలా సన్నగా వుంటుంది. ఆ పొట్టును ఆవ పెట్టి కూర వండితే... ఆహా( !......ఏమి రుచి !

ఇప్పుడు వేసవి కాలం. పనసపండ్లు విరివిగా వచ్చేకాలం. పనస ఒకప్పుడు మనదేశానికే ప్రత్యేకం. విదేశాల వారు ఈ పండు ఆకారానికి, రుచికి తన్మయులై ఈ చెట్టును ( విత్తనాన్ని ) ఇక్కడినుంచి తరలించుకు పోయారని చరిత్ర. మన దేశంలో తూర్పు, పశ్చిమ కనుమల్లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి. మన రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రాంతాలలోను ఈ చెట్లు కనబడతాయి. ఇది ఉష్ణమండల పంట అవడం వలన, దీని పెరుగుదలకు గాలిలో తేమ ఎక్కువగా వుండాలి కనుక మన రాష్ట్రంలో ఇవి ఎక్కువగా కోస్తా ప్రాంతంలో పెరుగుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో అందులోనూ డెల్టా ప్రాంతమైన కోనసీమ లోను మరీ ఎక్కువగా కనబడతాయి. సారవంతమైన నేల కావడం వలనో, గాలిలో తేమ బాగా వుండటం వలనో కోనసీమ పనస మరింత రుచిగా వుంటుంది.

పనసలో పోషక విలువలు అధికం. దీనిలో కెరోటిన్, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, పొటాషియం, విటమిన్ ' సి ' అధికంగా వుంటాయి. కొన్ని రకాల రుగ్మతలకు పనస మేలు చేస్తుంది. పూజలు, వ్రతాలలో పనస ప్రాధాన్యం చాలా వుంది. పనసపళ్లు దానాలివ్వడం, పూజా ద్రవ్యాలలో మామిడితో బాటు పనస ఆకులను ఉపయోగించడం జరుగుతుంటుంది. దక్షిణాది దేవాలయాల్లో పనస చెట్టుని స్థలవృక్షంగా భావించి పెంచడం కనిపిస్తుంది. కేరళ ప్రాంతంలో హోమాలు, యజ్ఞాలు చేసేటపుడు అగ్ని రగల్చడానికి ఎండు పనస కొమ్మలను రాపాడిస్తారు.

" పనసపండులాంటి బిడ్డను కను " అనే పెద్దల దీవెన ఆ పండుకున్న విశిష్టతలను బట్టే వచ్చివుంటుంది. అందుకే పళ్ళన్నిటిలో పనస రారాజు లాంటిది. అందుకే రాజా ఫలం ' పనస ' . ఈ వేసవిలో విరివిగా దొరికే ఈ ఫలరాజును ఒకసారి గుర్తు చేసుకుందామనిపించి.........         

Vol. No. 01 Pub. No. 284

Friday, May 7, 2010

మనసు కవి జ్ఞాపకాలు

జీవితంలో వచ్చే చిక్కులు మెదడుకు బలం కలిగించే టానిక్కులు
కీర్తిని తాకట్టు పెట్టుకునే మార్వాడీ వుంటే బాగుండును
బాగా బ్రతకడం ఎవరైనా బ్రతకొచ్చు. కానీ బాగా చావడం అదృష్టం.
- ఆచార్య ఆత్రేయ

 ఆయన అదృష్ట సంఖ్య - 7
ఆయన కొంతకాలం నివసించిన ఇంటి నెంబర్ - 124
ఆయన వాడిన కార్ నెంబర్ - 1510
ఆయన మాతృసంస్థలాంటి అన్నపూర్ణ ఆఫీసు ఇంటి నెంబర్ - 34
ఆయన పుట్టిన రోజు 7 వ తారీఖు

 1921 వ సంవత్సరం మే 7 వ తేదీన పుట్టిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు.
ఆయనే మన కవి, మనసు కవి ఆచార్య ఆత్రేయ

 


" నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా !


ఇదొక్కటే పది కావ్యాల పెట్టు. కాళిదాసు వింటే  కౌగలించుకునేవాడు "
ఈ మాటలన్నది ఆత్రేయ నాటకోత్సవాల్లో ఆయన పాటల విశిష్టత గురించి వివరిస్తూ మరో సుప్రసిద్ధ కవి డా. సి. నారాయణ రెడ్డి.

వినయశీలత : మహాకవి శ్రీశ్రీ కంటే ఆత్రేయ వయసులో పదేళ్ళు చిన్న. దానికాయన " కాదు. యాభైయేళ్ళు చిన్నవాణ్ణి. శ్రీశ్రీకి, నాకు ప్రతిభలో ఎన్నో అంతరువులు తేడా వున్నది " అంటారు.

దార్శనికత ఆత్రేయగారు " ఈనాడు " నాటకాన్ని మహాత్మాగాంధీ హత్యకు చాలా రోజుల ముందే రచించారు. అ నాటకంలోని సన్నివేశంలో ఒక మతోన్మాది విసిరిన కత్తి దెబ్బకు గాంధీజీ పటం పగిలి నేలమీద పడుతుంది.  

ఆత్రేయగారి రచనలకు ప్రేరణ : నాకేదో తెలుసుననే అజ్ఞానం. ఆది ఇతరులకు చెప్పాలనే ఆరాటం.

ఆత్రేయగారి దృష్టిలో సంతృప్తి : ఏ కళాకారుడికీ ఎందులోనూ సంతృప్తి అనేది కలుగకూడదు. కలిగితే ఆగిపోతాడు.

ఆత్రేయగారు తన భాష గురించి : బరువైన భావాన్ని తేలికైన పదాల్లో పొదగడానికి కారణం - అంతకంటే భాష రాదు కనుక.

ఆత్రేయ చమత్కారాలు :
* నేను కొన్ని మంచి సినీ గేయాలు రాశాను. కొన్ని మనీ గేయాలు రాశాను.
* నిర్మాత గురించి " వాళ్ళ సినిమా పూర్తయిందట.  అమ్మ  లేదట. అందుకే వాళ్ళను నిర్  మాత  అన్నారు.
* మీరు పాటలెలా రాస్తారని అడిగితే ఆత్రేయ గారి సమాధానం " నేనసలు పాటలుగానీ, మాటలుగానీ రాయను..................
రాయిస్తాను " అన్నారు. ఆయనకు డిక్టేట్ చెయ్యడం అలవాటు.
* ఒకసారి చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో ఆత్రేయ గారు రాస్తున్న పాటకు పల్లవి పూర్తయింది.
" అను పల్లవి చెప్పండి " అన్నారు చక్రవర్తి
    " ముందు నువ్వు పల్లవి ' అను ' - నేను అనుపల్లవి అంటాను " అన్నారు ఆత్రేయ
    అదికూడా పూర్తయింది. " ఇక చరణాలు " అన్నారు చక్రవర్తి
    " అదే ! ఎవరి చరణాలు పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను " అన్నారట ఆత్రేయ.

    ....... ఇవీ ఆత్రేయగారి గురించిన కొన్ని కమ్మని జ్ఞాపకాలు .

    ఆచార్య ఆత్రేయ మనసు పెట్టి రాసిన ' మనసు ' పాటల తునకలు -



    ఆత్రేయగారి మరికొన్ని మచ్చుతునకలు -





    తెలుగు చలన చిత్ర రంగంలో ఒక మైలు రాయి ఆచార్య ఆత్రేయ. ఆయన 79 వ జన్మదిన సందర్భంగా స్మృత్యంజలి.

    Vol. No. 01 Pub. No. 283

    Thursday, May 6, 2010

    రక్తకన్నీరు

    రక్తకన్నీరు - ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన నాటకం
    నాటక రంగానికి గ్లామర్ తెచ్చి ఐదువేలకు పైగా ప్రదర్శనలిచ్చిన నాటకం
    ఆ ప్రదర్శన కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు
    టికెట్ల కోసం సాధారణ జనం పడే పాట్లు
    ఫ్రీ పాసులకోసం నాయకులు, అధికార్ల వెంపర్లాట
    ఈ ఫ్రీ పాసు ప్రేక్షకులపై నాటక ప్రారంభంలోనే విసుర్లు
    ........ ఇదీ ఒకప్పుడు రక్తకన్నీరు రంగస్థల చిత్రం

    ఆ రంగస్థల కథానాయకుడు, నాటకానికి క్రేజు తెచ్చిపెట్టిన నటుడు
    విలక్షణమైన నటనతో , విభిన్నమైన సంభాషణా విధానంతో
    తెలుగు చలన చిత్ర రంగానికి కొత్త తరహా విలనీ నందించిన నాగభూషణం

    అందర్నీ మెప్పించి, ఒప్పించి తన చదువును కొనసాగించి
    ఉద్యోగంకోసం చెన్నై చేరిన నాగభూషణం నాటకాలవైపు నడిచి
    మిక్కిలినేని, జి. వరలక్ష్మి లాంటి నటుల సహచర్యం
    ఆత్రేయ కప్పలు, భయం లాంటి నాటకాలు
    కె.వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావుల రసన సమాఖ్యకు చేర్చింది.
    రంగస్థలం నాగభూషణాన్ని ఆదరించింది
    నాగభూషణం రంగస్థలాన్ని నమ్ముకున్నాడు

    ' ఏది నిజం ' లో కథానాయకుడిగా
    1951 లో ' పల్లెటూరు ' నాగభూషణాన్ని వెండితెరకు పరిచయం చేసింది.
    1956 లో ' ఏది నిజం ' నాగభూషణాన్ని కథానాయకుణ్ణి చేసింది
    ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ నటునిగా రకరకాల పాత్రలు
    విలనీలో కామెడీని రంగరించిన ఆయన పధ్ధతి
    సంభాషణలు పలికే తీరులో ప్రదర్శించే విలక్షణత
    నాగభూషణాన్ని తెలుగు ప్రేక్షకుల మనస్సులలో పదిలపరిచాయి  

    1995 మే 6 వతేదీన ఆ రక్త కన్నీరు ఇంకిపోయింది.
    ఆ నటభూషణం పైలోకంలో తన విశ్వరూపాన్ని చూపడానికి వెళ్ళిపోయాడు.


    నాగభూషణం వర్థంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..........

    మనవి : రక్తకన్నీరు - ఓ జ్ఞాపకం నా స్వ ' గతం ' పేజీలో .............




    Vol. No. 01 Pub. No. 282

    Tuesday, May 4, 2010

    తెలుగు జిప్సీ పాట

     కృష్ణ - ఆ పేరు చెబితే సాహసం గుర్తుకొస్తుంది. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన చేసినన్ని సాహసాలు ఇంకెవరూ చెయ్యలేదేమో ! తొలి పూర్తి నిడివి సినిమా స్కోప్ వర్ణ చిత్రం ' అల్లూరి సీతారామరాజు ', తొలి 70 mm చిత్రం ' సింహాసనం ' ......... ఇలా ఎన్నో !

    కృష్ణ 1971 లో నిర్మించిన ' మోసగాళ్ళకు మోసగాడు ' చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ అద్భుతం. అప్పట్లో కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే ఆంగ్ల చిత్రాలు విడుదలవుతూ వుండేవి. అక్కడి ప్రేక్షకులకు మాత్రమే ఆంగ్ల కౌబాయ్ చిత్రాలు పరిచయం. మిగిలిన ప్రాంతాల ప్రేక్షకులకు అంతగా పరిచయం వుండేవి కాదు. కొత్త రకం ఆహార్యాలు. కొత్త రకం సెట్టింగ్ లూ, కొత్త రకం దుస్తులు, కొత్త రకం సంగీతం, గుర్రాలు, ఎడారులు, చేజింగ్ లూ.....ఇలా ఎప్పుడూ తెలుగు తెర మీద చూసి వుండని  ఒక కొత్త తరహా చిత్రాన్ని చూసి ఆంధ్ర ప్రేక్షకులు విరగబడ్డారు.

    ' మోసగాళ్ళకు మోసగాడు ' చిత్ర కథా, కథనంలో అంతకుముందు ఆంగ్లంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం  ' మెకన్నాస్ గోల్డ్ ' చిత్రంతో చాలా దగ్గర పోలికలున్నాయి. ఒక రకంగా తెలుగు చిత్రం కూడా ఏదో హాలీవుడ్ చిత్రం చూస్తున్నట్లుంటుంది. విచిత్రమేమిటంటే ' మోసగాళ్ళకు మోసగాడు ' చిత్రాన్ని ఆంగ్లంలో  ' ది ట్రెజర్ ' పేరుతో డబ్ చేసి విదేశాలలో విడుదల చేస్తే ఆది కూడా హిట్ అయింది. అప్పట్లో తెలుగు చిత్రాలకు విదేశాల్లో మార్కెట్ లేదు. సి. డి. లు, డి. వి. డి.లు అసలే లేవు. ఈ ఆంగ్ల చిత్రంలో పాటలుండవు. 

    ' ది ట్రెజర్ ' చిత్రం గ్రీక్ దేశంలో ప్రదర్శించే సమయంలో ఆ దేశానికి చెందిన ఓ పంపిణీదారునికి ఆ చిత్రం నచ్చి తమ భాషలోకి అనువాదం చేస్తే బాగుంటుందనిపించింది.  సంప్రదింపులు జరిగాయి. తెలుగు చిత్రంలో రాజసులోచన ఆహార్యం, ఆవిడపై చిత్రీకరించిన పాట కూడా అతనికి చాలా నచ్చాయి. ఆంగ్ల చిత్రంలో ఆ పాట లేకపోయినా గ్రీక్ లో ఆ పాటను కలుపుకుంటానన్నాడు. మరి పాట కూడా గ్రీక్ భాషలోకి అనువాదం చేస్తారా అంటే అవసరం లేదు తెలుగులోనే ఉంచేస్తానన్నాడట. మీ ప్రేక్షకులకు సాహిత్యం అర్థం కాక ఇబ్బంది అవుతుందేమోనంటే......

    " ఏం ఫర్వాలేదు. ఆ నటి ఈ చిత్రంలో వేసింది జిప్సీ వేషం కదా ! ఆ పాట జిప్సీ భాషలో వుంది అనుకుంటారు " అన్నాడట ఆ గ్రీకు పంపిణీదారుడు. అర్థం కాని భాషను ఆ రకంగా సరిపెట్టేసుకున్నాడన్న మాట. 
     



    Vol. No. 01 Pub. No. 281

    Monday, May 3, 2010

    సినారె మాటల చమక్కులు

    డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి పాటలే కాదు మాటలు కూడా బహు పసందుగా వుంటాయి. తెలుగు భాష సొగసును ఆయన మాటల్లో చూడవచ్చు. ఆయన ముఖ్య అతిథిగా వస్తే ఆ సభ కళ కళ లాడుతుంది. మాటలతో చదరంగం ఆడుకుంటారు సినారె.

    * మన రాష్ట్రంలో పేరుపొందిన నాటక పరిషత్తులలో తూర్పుగోదావరి జిల్లా రామవరంలోని నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ ఒకటి. ఒకసారి ఆ పరిషత్తు ఉత్సవాల్లో డా. సి. నారాయణ రెడ్డి గారికి సన్మానం ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు బ్రహ్మాండంగా వున్నాయి. ఇసుక వేస్తే రాలనంత జనం. ఆ సందోహాన్ని చూసి ఒక వక్తకు ఉత్సాహం పెల్లుబుకింది. ఆ ఉత్సాహంలో ఆ సభను మయసభ తో పోల్చాడు.
    సినారె గారు దానికి ప్రతిస్పందిస్తూ " ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు ఈ మహాసభను మయసభతో పోల్చారు. అయితే మయసభ అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమ కల్పించడం. పైగా అపోహలూ, అవమానాలు. కనుక ఇది మయసభ అనడం సరైనది కాదు. దీన్ని మనం వాజ్ఞ్మయసభ అంటే బాగుంటుంది. " అన్నారు. ఇక సభంతా ఒకటే కేరింతలు ఆ గిలిగింతలకి. 

    * మార్కాపురం పలకలకి ప్రసిద్ధి అని మనకందరికీ తెలుసు. రాతి పొరలనుండి ఆ పలకలు తయారవుతాయి. కొంతకాలం క్రితం వరకూ మార్కాపురం పలక మీద ఓనమాలు దిద్దని తెలుగు వారుండేరేవారు కాదు. ఇప్పటి తరానికి పలకాలంటే తెలీదేమో !
    ఓసారి ఆ ఊరి కళాశాల వార్షికోత్సవానికి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ రోజు ఆయన తన ఉపన్యాసంలో " కొందరి గుండెల్లో పొరలు లాగే మార్కాపురం బండల్లో కూడా పొరలున్నాయి. అయితే మనుష్యుల గుండెల్లోవి పొరలు ఉండకూడని పొరలు. మార్కాపురం బండల్లో వున్న పొరలు ఉండాల్సిన పొరలు. ఎందుకంటే అవి అందరికీ పనికొచ్చేవి కనుక " అనడంతో మార్కాపురం వాసుల ఆనందం చెప్పాలా !

     ఇవి నారాయణ రెడ్డి పద విన్యాసానికి మచ్చు తునకలు మాత్రమే !

    Vol. No. 01 Pub. No. 280

    Sunday, May 2, 2010

    నవ్వే పరమౌషధం !

    నవ్వడం ఒకయోగం.
    నవ్వించడం ఒక భోగం.
    నవ్వకపోవడం ఒక రోగం.
    అన్నారు మన హాస్యబ్రహ్మ జంధ్యాల.

    నవ్వు ఆరోగ్యానికి దగ్గర దారి. హాయిగా ఆనందంగా నవ్వగలిగే వారి దగ్గరికి రోగాలు చేరడానికి భయపడతాయి. ఈ నవ్వు విశిష్టతను విశ్వవ్యాప్తం చెయ్యడంలో మన భారతీయునిదే ప్రధాన పాత్ర.

    1998 లో ముంబై కి చెందిన డా. మదన్ కటారియా అనే ఆయన నవ్వుల యోగా ప్రక్రియను విశ్వవ్యాప్తం చెయ్యాలనే సంకల్పంతో ప్రపంచ నవ్వుల దినోత్సవానికి అంకురార్పణ చేసాడు. అప్పటినుండి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం మే నెల మొదటి ఆదివారం ఈ నవ్వుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. నవ్వు ద్వారా స్నేహం, సౌభ్రాతత్వం పెంపొందించి తద్వారా ప్రపంచశాంతికి కృషి చెయ్యాలని డా, కటారియా ఆశయం. ప్రపంచ ప్రజలందరినీ ఈ విషయంలో ఏకం చెయ్యడానికి ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రారంభించాడు. దీనికి దారి తీసిన పరిస్థితుల్ని ఒకసారి పరిశీలిద్దాం.

      ' రాత్రింబవళ్ళు వేధించే ఒత్తిళ్ళ మధ్య రోజూ కాసేపైనా నవ్వలేకపోతే నేను ఎప్పుడో మరణించి ఉండేవాణ్ణి ' అన్నారు అబ్రహాం లింకన్. 
    ఇది సత్యం. ఈ సత్యాన్ని వంటపట్టించుకున్న మనిషి డాక్టర్ మదన్ కటారియా. తానే కాదు తన నగర ప్రజలకు... కాదు.. రాష్ట్ర ప్రజలకు... కాదు.. కాదు.. ఈ దేశ ప్రజలకు... ఊహు! కాదు... కాదు... ప్రపంచానికే నవ్వుల టానిక్ ని పంచాడీ డాక్టర్. 1995 మార్చి 13 న తెల్లవారు ఝామునే లేచిన ఆయనకు ఎందుకో నవ్వు వచ్చింది. దాని గురించి ఆలోచిస్తుండగా ఆయనకు అమెరికాకు చెందిన నార్మన్ కజిన్స్ అనే ఆయన రాసిన 'అనాటమీ ఆఫ్ ఏన్ ఇల్ నెస్' అనే పుస్తకం గుర్తుకొచ్చింది. అందులో తన వెన్నుముకకు వచ్చిన వ్యాధి నవ్వుతో ఎలా నయమయిందో కజిన్స్ వివరంగా రాశాడు. కాలిఫోర్నియా లిండా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ లీ.ఎస్.బెర్క్ శరీరానికి వత్తిడికి కలిగించే హార్మోన్లను కట్టడిచేసి వ్యాధి నిరోధకశక్తిని పెరగడానికి నవ్వు సరైన మందుగా తన పరిశోధనలలో వెల్లడయిందని పేర్కొంటూ ఒక పరిశోధన గ్రంథం రాశాడు.

    ఈ విషయాలన్నీ తన 'మేరా డాక్టర్' అన్న పత్రికలో రాస్తే పాఠకులు నవ్వు గొప్పదనాన్ని తెలుసుకుంటారనిపించింది డాక్టర్ మదన్ కి. కానీ ఆ వెంటనే తన పత్ర్రిక ఎంతమంది చదువుతారు? చదివినా తన వ్యాసం ఎవరు చదువుతారు? చదివినా ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారని... ఇలా చాలా సందేహాలొచ్చాయి. అలా ఆలోచిస్తూనే ఆయన రోజూ వెళ్ళే ఉదయపు వ్యాహ్యాళికి అదేనండి! మార్నింగ్ వాక్ కి బయిలుదేరాడు. అలవాటుగా వెళ్ళే లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్ళాడు. అక్కడ ఇంకా ఆయన లాంటి వాళ్ళు చాలామంది చేరారు. వాళ్ళందరినీ పిలిచి తనకొచ్చిన ఆలోచనలన్నీ వివరంగా చెప్పి రోజూ కొంతసేపైనా తనివి తీరా హాయిగా నవ్వుకుంటే ఆరోగ్యం దివ్యంగా ఉంటుందని మందులతో పని ఉండదని చెప్పాడు. ఇదంతా నవ్వులాటగా తీసుకున్న కొందరు వెళ్ళిపోగా, చెప్పేది డాక్టర్ కదా ఇదేమిటో చూద్దాం అని కొంతమందే మిగిలారు.

    వాళ్ళకు మదన్ ఒక జోక్ చెప్పాడు. అందరూ హాయిగా వవ్వారు. ఒకటి తర్వాత మరొకటిగా జోకులు పేల్చాడు. అందరికీ నవ్వనే ఔషధం పంచి, ఇక ఇంటికెళ్ళండి. ఈ రోజంతా మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని పిస్క్రిప్షన్ రాసిచ్చినంత ధీమాగా హామీ ఇచ్చేశాడు. అందులోని నిజాన్ని అనుభవించిన వాళ్ళందరూ మర్నాటి నుంచి తాము కూడా జోకులు చెప్పి అందర్నీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు. ఆరోగ్య ఫలితాలు అనుభవించారు.

    అలా ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో 1995 మార్చి 13 న లాఫర్స్ క్లబ్ ఏర్పడింది. తరవాత్తరవాత కేవలం జోకులే కాకుండా నవ్వును ఒక యోగ ప్రక్రియలా సాధన చెయ్యడం ప్రారంభించారు. నెమ్మదిగా ఈ క్లబ్ కి ముంబయి నగరమంతా, రాష్ట్రమంతా, దేశమంతా శాఖలు ఏర్పడ్డాయి. మానసిక, శారీరిక రుగ్మతలకు దివ్యౌషధమైన నవ్వు విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ లాఫర్స్ క్లబ్ సభ్యులు. ఇప్పుడది ప్రపంచ స్థాయికి చేరి నవ్వులకో రోజును ఏర్పాటు చేసుకుంది. 


    ఈ నవ్వుల దినోత్సవం రోజున మనం కూడా హాయిగా, మనసారా నవ్వుకుందాం! రోగాలను దూరం చేసుకుందాం ! 


    మనవి : ఈ సందర్భంగా హాస్య బ్రహ్మ జంధ్యాల అందించిన ఈ దండకం చూసి బ్లాగ్మిత్రులు ఈ రోజు  వీలైనన్ని ఎక్కువ నవ్వులు పంచండి. మీరు సృష్టించిన లేదా మీకు తెలిసిన జోకులను చెప్పండి.




    Vol. No. 01 Pub. No. 279

    Saturday, May 1, 2010

    నేడే ఈనాడే...మేడే !



    నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం
    ...................................
    మహాకవి శ్రీశ్రీ కలం సృష్టించిన సంరంభమది

    నేడే ఈనాడే శ్రామిక విజయ సంరంభం 
    1886 లో కార్మికులు కదం తొక్కిన సందర్భమది

    ఆ దినమే కార్మిక దినోత్సవం మేడే
    ..........................  ఆ మేడే నేడే 



    కార్మిక దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు



    Vol. No. 01 Pub. No. 278
    Related Posts Plugin for WordPress, Blogger...

    ప్రాచుర్యం