Thursday, November 19, 2009

సరస్వతి వారోత్సవాలు

పుస్తకం సరస్వతీ దేవి ప్రతిరూపం. పుస్తకాలు జ్ఞాన దీపాలు. వాటిని పరిరక్షించడం , అందరికీ అందుబాటులోకి తేవడం, భావి తరాలకు అందించడం ఇవన్నీ ఒక ఉద్యమంగా ప్రారంభమైంది 1914 నవంబరు 14 తేదీన. రోజు మద్రాస్ లో అయ్యంకి వెంకట రమణయ్య గారి ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి మహాసభలు జరిగాయి. సభలో గ్రంధాలయోద్యమానికి అంకురార్పణ జరిగింది. ఫలితంగా అఖిల భారత పౌర గ్రంధాలయ సంఘం ఏర్పాటయింది.
స్వాతంత్ర్య పోరాటంలో జైలు కెళ్ళిన తొలి ఆంధ్రుడుగా ఘనత వహించిన గాడిచర్ల హరి సర్వోతమరావుగారు ఆంధ్ర గ్రంధాలయ సంఘం అధ్యక్షులుగా 1934 నుండి ఆయన పూర్తి జీవిత కాలం 1960 వరకూ ఉన్నారు. పాతూరి నాగభూషణంగారు షుమారు 40 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశారు. గ్రంధాలయోద్యమ ఆవిర్భావానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం నవంబరు 14 వతేదీ నుండి 20 తేదీ వరకూ గ్రంధాలయ వారోత్సవాలు జరపాలని 1968 లో నిర్ణయించారు.
గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి పేరు మీద విజయవాడలో వెలిసిన సర్వోత్తమ గ్రంధాలయంలో వారోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు నగరంలోని పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం నిన్న ( 18 తేదీ ) జరిగింది. ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ ప్రద్యుమ్న పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గ్రంధాలయ కమిటీ కార్యదర్శి డా. రావి శారద నిర్వహించారు.







Vol. No. 01 Pub. No. 113

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం